యోగి తల్చుకుంటే ఏ క్షణమైనా ఆర్జీవీ అరెస్ట్ !

ఆర్జీవీ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కేసు నమోదైంది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిజానికి అలాంటి ఫిర్యాదులు తెలుగు రాష్ట్రాల్లోనూ చేశారు. కానీ కేసుల నమోదు వరకూ వెళ్లలేదు. కానీ లక్నోలో పోలీసులు కేసులు పెట్టేశారు. ఆర్టీవీపై ఆషామాషీగా కేసులు పెట్టి ఉండరని.. తర్వాత చర్యలు ఉంటాయన్న చర్చ ప్రారంభమైంది.

యూపీ సీఎం ఆదిత్యనాథ్ కాషాయధారి కావొచ్చు కానీ ఆయన పాలన మొత్తం ” అంతా నా ఇష్టం ” అన్న తరహాలో ఉంటుంది. ఓ వర్గం ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం దగ్గర్నుంచి… రౌడిషీటర్ల పేరుతో కాల్చి చంపడాలు.. ఎన్ కౌంటర్ చేయడాలు లెక్కలేనన్ని జరుగుతూ ఉంటాయి. యూపీలో పరిస్థితులపై అంతటా ఆశ్చర్యం వ్యక్తమవుతూ ఉంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా .. .ఏం జరిగినా.. ముఖ్యంగా సెంటిమెంట్ రెచ్చగొట్టేలా ఎలాంటివి చోటు చేసుకున్నా యోగి ప్రభుత్వం ఓ రేంజ్‌లో స్పందిస్తుంది. ఆర్జీవీపై కేసు విషయంలో తదుపరి చర్యలపై చర్చ అందుకే వస్తోంది.

రామ్ గోపాల్ వర్మ ఇంతకు ముందు పలుమార్లు హిందూ దేవుళ్లను అవమానించారు. ఆయన వ్యాఖ్యలు చాలా సార్లు వైరల్ అయ్యాయి. ఇలాంటివి బీజేపీ నేతలకు ముఖ్యంగా యూపీ సీఎం లాంటి వారికి నచ్చవు. చాన్స్ వస్తే దేవుడి పవర్ చూపించాలనుకుంటారు. ఇప్పుడు ఓ ట్వీట్ ద్వారా ఆర్జీవీ అలాంటి చాన్స్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆర్జీవీని ఏ క్షణం అయినా అరెస్ట్ చేసి తీసుకుపోయినా ఆశ్చర్యం లేదని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అంత సీరియస్‌గా తీసుకోరని కొంత మంది అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close