రఘురామ సీఐడీ ఎదుట హాజరు కాక తప్పదు!

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టారని సీఐడీ సుమోటోగా కేసు పెట్టి పుట్టినరోజు నాడే రఘురామను అరెస్ట్ చేసింది. ఆ రోజు రాత్రే తీవ్రంగా కొట్టారు. ఆ కేసు సెక్షన్లలో రాజద్రోహం కూడా ఉంది. ఇతర సెక్షన్లు కూడా ఉన్నాయి. రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టు విచారణ వద్దని చెప్పడంతో ఇతర సెక్షన్లపై విచారిస్తామని సీఐడీ పోలీసులు హైకోర్టును కోరారు. దానికి హైకోర్టు అంగీకరించింది. అయితే గతంలో సీఐడీ ఇలా విచారణ పేరుతో తీసుకెళ్లి కొట్టారు కాబట్టి ఈ సారి సీఐడీ ఆఫీసుల్లో విచారణ వద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

హైదరాబాద్‌ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో లాయర్‌ సమక్షంలో విచారించాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ చేయాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన అంశాలు మినహా ఏ ఇతర అంశాలపై పిటిషనర్‌ను ప్రశ్నించకూడదని హైకోర్టు పేర్కొంది. అలాగే సీఐడీ కార్యాలయాలకు పిలిపించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అంతా లాయర్‌ సమక్షంలోనే జరగాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే బాధ్యులైన పోలీస్‌ అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ హైకోర్టు పేర్కొంది.

ఎవరూ ఫిర్యాదు చేయకుండానే ఏబీఎన్, టీవీ ఫైవ్‌లో రచ్చబండ పేరుతో పెడుతున్న ప్రెస్‌మీట్లు శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నాయని సీఐడీ అధికారులు తమంతట తాము అనుకున్నారు. ఆయన రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్చను ఉపయోగించుకుటున్నారని అనుకోలేదు. ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని కూడా రాజద్రోహంగా పరిగణించారు. రాజద్రోహం మినహా ఇతర సెక్షన్ల కింద విచారణకు అనుమతి రావడంతో సీఐడీ ఎప్పుడైనా ఇక రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. బహుశా..రఘురామ నర్సాపురం వెళ్తానని చెబుతున్న నాలుగో తేదీన ఆయనను విచారణకు పిలిచే చాన్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close