ఇలా తీస్తే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు: రాజమౌళి

లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన”హ్యాపీ బర్త్ డే” ట్రైలర్ ని లాంచ్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులు థియేటర్ కి రావడం అనే అంశంపై తన విశ్లేషణ చెప్పారు. ”జనాలు థియేటర్ కి రావడం లేదనే మాట వినిపిస్తుంది. అయితే ఏది చేసిన సంపూర్ణంగా చేస్తే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారని నా విశ్లేషణ. కామెడీ చేస్తే జనాలు ఇరగబడి నవ్వేలా వుండాలి, ఫైట్స్ వున్న సినిమా తీస్తే గ్రేటెస్ట్ యాక్షన్ చూపించాలి. కానీ హాఫ్ హార్టడ్ గా సినిమాలు తీస్తుంటే జనాలు రావడం లేదు, సంపూర్ణంగా తీస్తే జనాలు వస్తారని భావిస్తున్నా. ‘హ్యాపీ బర్త్ డే’ కొత్త కాన్సెప్ట్. ఈ సినిమాని హాఫ్ హార్టడ్ గా కాకుండా పరిపూర్ణంగా తీశారు దర్శకడు రితేష్ రానా. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పడానికి కారణం ఇదే” అన్నారు రాజమౌళి.

ఇదే సందర్భంలో మైత్రీ మూవీ మేకర్స్ పై తనదైన శైలిలో ప్రసంసలు కురిపించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ గోల్డ్ డిగ్గర్స్. ఎక్కడ తవ్వితే బంగారం దొరుకుతుందో వాళ్ళకి బాగా తెలుసు. ఎక్కడిక్కడ మంచి ప్రాజెక్ట్లు ఉంటాయో సరిగ్గా పట్టుకుంటారు. మరో గోల్డ్ మైన్ ని పట్టుకున్న మైత్రీ మూవీ మేకర్స్, మరో నిర్మాణ భాగస్వామి క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ కి కంగ్రాట్స్’ చెప్పారు రాజమౌళి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close