ఎవరు కలిస్తే ఆ పార్టీలోకి వంగవీటి వెళ్లిపోతారా !?

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణతో జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశం ప్లాన్డ్ గా జరిగింది కాదు. పవన్ కల్యాణ్ మూడో తేదీన చేపట్టనున్న జనవాణి కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆడిటోరియం పక్కనే వంగవటి రాధా ఆఫీస్ ఉంది. దీంతో నాదెండ్ల మనోహర్ ఆయన ఇంటికి వెళ్లారు. టీ తాగారు. అంతే ఈ లోపు కొంత అత్యుత్సాహ మీడియా..సోషల్ మీడియా పులిహోర కలిపేశారు. వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలోకి వెళ్తారంటూ పుకార్లు ప్రారంభించాయి. అయితే భేటీ ముగిసిన తర్వాత ఇద్దరూ నేతలు చాలా కూల్‌గా రిప్లయ్ ఇచ్చారు.

కరెంట్ ఎఫైర్స్ కాదని కరెంట్ చార్జీలపై చర్చించామని నాదెండ్ల చెప్పారు. రాజకీయంగా ఎలాంటి విశేషం లేదన్నారు. పవన్ కల్యాణ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఆడిటోరియం పక్కనే ఉన్న తన ఆఫీసుకు వచ్చారని అందుకే మాట్లాడానన్నారు వంగవీటి. వంగవీటి రాధాకృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు ఓ రకంగా దూరంగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణలకు.. రంగా పేరుతో నిర్వహించే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు.

ఎప్పుడైనా శుభకార్యాల్లో ఎదురుపడితే తన మిత్రులైన వైఎస్ఆర్‌సీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలతో మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు కూడా ఆయన వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నెల 4వ తేదీన దివంగత నేత వంగవీటి రంగా జయంతి కార్య‌క్రమాన్ని భారీగా నిర్వ‌హించేందుకు రాధా రంగా మిత్ర మండ‌లి ఏర్పాట్లు చేస్తోంది.ఈ కార్య‌క్ర‌మాన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా నిర్వ‌హిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close