ఆగ‌స్టులో మొద‌లు… వేస‌విలో విడుద‌ల‌

‘అత‌డు’ త‌ర‌వాత మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ కాంబో సెట్ట‌య్యింది. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చి చాలాకాల‌మైనా షూటింగ్ ఇంకా మొద‌లు కానేలేదు. క‌థ కుద‌రిందా, స్క్రీన్ ప్లేలో మార్పులు జ‌రుగుతున్నాయా, న‌టీన‌టుల ఎంపిక పూర్త‌వ‌లేదా? అంటూ ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపించాయి. అయినా చిత్ర‌బృందం నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ చాలా ర‌కాలైన పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కానీ… ఇప్ప‌టి వ‌ర‌కూ ఏదీ ఖ‌రారు కాలేదు. అస‌లు చిత్ర‌బృందం నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దాంతో ఫ్యాన్స్ ఉస్సూరుమంటున్నారు. ఇప్పుడు వాళ్లంద‌రికీ ఓ తీపి వార్త‌. మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమా మొద‌లైపోతోంది. ఆగ‌స్టులో.

అవును… ఆగ‌స్టు నుంచి చిత్రీక‌ర‌ణ మొద‌లెట్ట‌నున్నామ‌ని చిత్ర‌బృందం అధికారిక ప్ర‌క‌ట‌న ఇచ్చేసింది. అంతేకాదు… రిలీజ్ గురించిన క‌బురు కూడా చెప్పేసింది. 2023 వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. మే లేదా జూన్‌లో ఈ సినిమా బ‌య‌ట‌కు రావొచ్చు. ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల్సిన బాధ్య‌త త్రివిక్ర‌మ్ దే. ఎందుకంటే… ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే, మ‌హేష్ బాబు రాజ‌మౌళితో జ‌త‌క‌ట్టాల్సివుంది. ఆయ‌న మ‌హేష్ కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే త్రివిక్ర‌మ్ కూడా చ‌క చ‌క సినిమా ఫినిష్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close