బీజేపీలో వెంకయ్యకు ఇక యాక్టివ్ రోల్ కష్టమే !

బీజేపీలో చిన్న స్థాయి కార్యకర్త నుండి అధ్యక్షుడి వరకూ.. ప్రజాప్రతినిధి.. దిగువస్థాయి నుంచి ఉపరాష్ట్రపతి వరకూ ఎదిగిన వెంకయ్యనాయుడు రాజకీయ ప్రస్థానం దాదాపుగా ముగిసినట్లే భావిస్తున్నారు. ఆయన వయసు ఇప్పుడు 73 ఏళ్లు. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంటే. పార్టీలో కూడా ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. ఈ కారణంగా బీజేపీ ఉద్దండులన్నీ ఇంటికే పరిమితమయ్యారు. వారి జాబితాలో చివరిగా అయినా వెంకయ్యకు అనధికారిక రిటైర్మెంట్ ఇచ్చినట్లవుతోంది.

అయితే వెంకయ్యనాయుడు ఆరోగ్య పరంగా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయంగా ఆయన ఖాళీగా ఉండటం కష్టమేనని చెబుతున్నారు. బీజేపీ వ్యూహాల్లో తెర వెనుక పాత్ర అయినా పోషిస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీలో మోదీ, షాలు తప్ప మరొకరి వ్యూహాలు ఆలోచనలు అమలు చేసే పరిస్థితి లేదు. వారు చెప్పినట్లుగా చేయాల్సిందే. అదే సమయంలో వెంకయ్య సంప్రదాయ రాజకీయాలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి వాటికి మోదీ, షాలు వ్యతిరేకం. వారి రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి.

వెంకయ్యనాయుడు ఇక పూర్తిగా రాజకీయాలకు దూరమైనట్లేనని బీజేపీ వర్గాలు కూడా ఓ అంచనాకు వస్తున్నాయి. ఆయనకు ఇక ఎలాంటి పదవి దక్కకపోవచ్చని అంటున్నారు. ఉపరాష్ట్రపతిగా చేసిన ఆయన మరో పదవి తీసుకోలేరు. ఆయన స్థాయికి తగ్గ పదవిని సృష్టించలేరు కూడా. అందుకే ఆయన రాజకీయ ప్రస్థానం ఇంతటితో ముగిసినట్లేనని అంచనా వేస్తున్నారు. అయితే వెంకయ్యనాయుడు మాత్రం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా తన పదవీ కాలం చివరి రోజున భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close