కేసీఆర్‌ను పిలిచిన స్టాలిన్‌కు జగన్ గుర్తు రాలేదా ?

జగన్ ప్రమాణ స్వీకార వేడుకలకు వచ్చిన ఇద్దరు ఇతర రాష్ట్రాల కీలక నేతలు కేసీఆర్, స్టాలిన్. ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా వారి మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. కేంద్రంపై కలిసి పోరాడటానికి ఎలాంటి అంశమైనా స్టాలిన్ అందరికీ లేఖలు రాస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో స్టాలిన్ కేసీఆర్‌తో మాత్రమే కాస్త ఎక్కువ సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ సీఎం జగన్‌ను పట్టించుకోవడం లేదు.

తమిళనాడులో ఫిడె చెస్ ఒలింపియాడ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని స్టాలిన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇరుగుపొరుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులందర్నీ ఆహ్వానించారు. ప్రత్యేకంగా కేసీఆర్ వద్దకు ఓ ఎంపీని పంపించి ఆహ్వానపత్రిక అందించారు. స్టాలిన్ ఫోన్ చేసి మాట్లాడారు. అయితే కేసీఆర్‌కు ఇంత గౌరవం ఇచ్చిన ఆయన ఏపీ సీఎం జగన్‌ను మాత్రం ఆహ్వానించలేదు. ఎవరైనా ఆహ్వానించి ఉంటే.. తమిళనాడు నుంచి ఎంపీ వచ్చారని.. జగన్‌ను ఆహ్వానించారని పీఆర్వో టీం ప్రకటించి ఉండేది. కానీ రాలేదు.

కేసీఆర్‌ను పిలిచినప్పుడు జగన్‌ను స్టాలిన్ను ఎందుకు పిలువలేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెస్ ఒలింపియాడ్ అనేది రాజకీయ కార్యక్రమం కాదు. ప్రధాని ప్రారంభిస్తున్నారు. అలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆహ్వానిస్తారు. అయినా స్టాలిన్ పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరమే. అయితే స్టాలిన్ ఆహ్వానించారని.. కానీ వెళ్లకూడదనుకున్నారు కాబట్టే బయటకు రానీయలేదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. గతంలో విపక్షాల భేటీకి మమతా బెనర్జీ ఆహ్వానించినా.. తొక్కి పెట్టారు. ఆహ్వానం అందలేదని చెప్పుకున్నారు. కానీ తర్వాత అసలు విషయం బయటపడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేసిన నాగబాబు… ఆ ట్వీటే కారణమా..?

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు అనూహ్యంగా ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సడెన్ గా ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది ఆసక్తి...

సాయంత్రం కుండపోతే… హైదరాబాద్ కు బిగ్ అలర్ట్..!!

గురువారం కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ ఇంకా తేరుకోనేలేదు.. అప్పుడే మరో బిగ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. శుక్రవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది....

ఏపీ అట్టుడుకుతుంటే విదేశీ పర్యటనా..?

రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా, ఏపీ సీఎం జగన్ వైఖరి కూడా అదే తరహాలో ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు హింసాత్మక ఘటనలతో రాష్ట్రం భగ్గుమంటుంటే వాటిపై దృష్టి...

భూ వివాదం.. ఎన్టీఆర్ క్లారిటీ

ఎన్టీఆర్ సొంత ఇంటికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ భూమి కొని మోస‌పోయాడ‌ని, ఈ కేసు విష‌యంలో హైకోర్టు వ‌ర‌కూ వెళ్లాడ‌న్న‌ది స‌ద‌రు వార్త సారాంశం....

HOT NEWS

css.php
[X] Close
[X] Close