మోదీ కంటే జగన్ పాలన బెటరంటున్న విజయసాయిరెడ్డి !

రాజకీయం కోసం ఎన్ని విమర్శలు చేసినా బీజేపీ నేతలు… ఆ పార్టీ హైకమాండ్ నవ్వుతూ భరిస్తున్నారని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. సీఎం జగన్ స్వయంగా వరద బాధితుల దగ్గర్కు వెళ్లి .. మోదీని మీరు తిట్టుకుంటున్నారని ఆయనకే చెబుతానని ప్రకటించేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. ఏపీ అప్పుల కుప్ప అయిందని …మరో శ్రీలంక అవకుండా జాగ్రత్త పడాలని కేంద్రం చెబుతూంటే.. విజయసాయిరెడ్డి మండి పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ సమర్థ నాయకత్వం చేతుల్లో ఉందని ..కేంద్రం కంటే మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉందని ఆయన చెబుతున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని ఆయన అంటున్నారు. ఒకర కంగా కేంద్రం కంటే ఏపీ పరిస్థితినే ఆర్థికంగా మెరుగ్గా ఉంది. 2021-22 సంవత్సరంలో కేంద్రం జీడీపీ 57 శాతంగా ఉంది. ఏపీ జీడీపీ ఐదో స్థానంలో ఉంది. ఎగుమతుల్లోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించింది. కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిందంటున్నారు.

కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. 41 శాతం పన్నుల వాటా కేంద్రం ఇస్తున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సెస్‌, సర్‌ఛార్జీలు కేంద్రం ఏటా పెంచుతోంది. కానీ, ఆ ఆదాయం మాత్రం కేంద్రం పంచడం లేదన్నారు. ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని విజయసాయిరెడ్డి ప్రధానమంత్రికి సూచించారు. రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడుతున్న కేంద్రం.. తన అప్పుల సంగతిపై ఏం చెబుతుందని ప్రశ్నించారు.

గతంలో ఎప్పుడూ ఏపీని కించ పరిచినా.. లేకపోతే.. ఏపీకి నష్టపరిచే వ్యాఖ్యానాలు ఢిల్లీలో వినిపించినా వైసీపీ నేతలు పెద్దగా స్పందించేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం విజయసాయిరెడ్డి పార్టీ ఎంపీలంద్రనీ వెంట బెట్టుకుని కూర్చుని విమర్శలుచేశారు. ఏ వ్యూహమో కానీ.. ఇది రివర్స్ అయితే కష్టమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close