కేసీఆర్‌ను పిలిచిన స్టాలిన్‌కు జగన్ గుర్తు రాలేదా ?

జగన్ ప్రమాణ స్వీకార వేడుకలకు వచ్చిన ఇద్దరు ఇతర రాష్ట్రాల కీలక నేతలు కేసీఆర్, స్టాలిన్. ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా వారి మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. కేంద్రంపై కలిసి పోరాడటానికి ఎలాంటి అంశమైనా స్టాలిన్ అందరికీ లేఖలు రాస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో స్టాలిన్ కేసీఆర్‌తో మాత్రమే కాస్త ఎక్కువ సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ సీఎం జగన్‌ను పట్టించుకోవడం లేదు.

తమిళనాడులో ఫిడె చెస్ ఒలింపియాడ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని స్టాలిన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇరుగుపొరుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులందర్నీ ఆహ్వానించారు. ప్రత్యేకంగా కేసీఆర్ వద్దకు ఓ ఎంపీని పంపించి ఆహ్వానపత్రిక అందించారు. స్టాలిన్ ఫోన్ చేసి మాట్లాడారు. అయితే కేసీఆర్‌కు ఇంత గౌరవం ఇచ్చిన ఆయన ఏపీ సీఎం జగన్‌ను మాత్రం ఆహ్వానించలేదు. ఎవరైనా ఆహ్వానించి ఉంటే.. తమిళనాడు నుంచి ఎంపీ వచ్చారని.. జగన్‌ను ఆహ్వానించారని పీఆర్వో టీం ప్రకటించి ఉండేది. కానీ రాలేదు.

కేసీఆర్‌ను పిలిచినప్పుడు జగన్‌ను స్టాలిన్ను ఎందుకు పిలువలేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెస్ ఒలింపియాడ్ అనేది రాజకీయ కార్యక్రమం కాదు. ప్రధాని ప్రారంభిస్తున్నారు. అలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆహ్వానిస్తారు. అయినా స్టాలిన్ పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరమే. అయితే స్టాలిన్ ఆహ్వానించారని.. కానీ వెళ్లకూడదనుకున్నారు కాబట్టే బయటకు రానీయలేదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. గతంలో విపక్షాల భేటీకి మమతా బెనర్జీ ఆహ్వానించినా.. తొక్కి పెట్టారు. ఆహ్వానం అందలేదని చెప్పుకున్నారు. కానీ తర్వాత అసలు విషయం బయటపడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close