షూటింగులు బంద్ పాక్షికమేనా ?

చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి చిత్రీకరణలు నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్‌ జనరల్‌ బాడీ నిర్ణయించన సంగతి తెలిసిందే. గిల్డ్‌ నిర్ణయానికి ఫిలిం ఛాంబర్‌ మద్దతు తెలిపింది. అందరం కూర్చొని మాట్లాడుకుంటామని, పరిష్కారం దొరికే వరకూ షూటింగ్‌లను తిరిగి మొదలు పెట్టబోమని ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.

ఐతే ఇప్పుడా బంద్ పాక్షికమే అనిపిస్తుంది. సోమవారం కొన్ని సినిమాల షూటింగ్ జరిగాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ హీరోగా సిద్ధమవుతోన్న ‘వారసుడు’, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకీ అట్లూరి-ధనుష్‌ కాంబోలో రానున్న ‘సార్‌’ షూట్స్‌ యధావిధిగా నిర్వహించారు. బంద్ పై తమకు సమాచారం లేదని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ చెబుతోంది. మిగతా కార్మికులు కూడా యధావిధిగా షూటింగులకు హాజరయ్యారు. బంద్ విషయంలో మొదటి నుండి ఏకాభిప్రాయం లేదనే మాట వినిపిస్తుంది. దిల్ రాజు నిర్మాతగా వున్న వారసుడు సినిమా షూటింగు సైతం జరగడం బంద్ పాక్షికమే అనే సంకేతాలు ఇస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close