అవినీతి విపక్ష నేతలు మాత్రమే చేస్తారా !?

ఎర్రకోట పై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగంలో రాజకీయ వారసత్వాన్ని.. అవినీతిని అంతమొందిస్తానని మీ ఆశీర్వాదం కావాలని ప్రజలను కోరారు. అయితే రాజకీయ వారసత్వం సంగతేమో కానీ అవినీతి అంశంపై మాత్రం రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రధానిగా తొమ్మిదో సారి జాతీయ జెండా ఎగురవేశారు ప్రధానమంత్రి మోదీ. మొదటి సారి జెండా ఎగురవేయడానికి.. ఇప్పుడు జెండా ఎగురవేయడానికి మధ్య ఉన్న కాలంలో అవినీతి అంతానికి ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాల్సి ఉంది.

నిజానికి కేంద్రం చేస్తున్న అవినీతి పోరాటం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఎనిమిదేళ్లుగా త్రివిధ దళాల పేరుతో సీబీఐ, ఐటీ, ఈడీలతో విపక్ష నేతలపై దాడులు చేయించి.. వారితో పార్టీలు మార్పించి.. ప్రభుత్వాలను కూలగొట్టడం తప్ప.. నిజంగా అవినీతి పరులపై తీసుకున్న చర్యలేవీ లేవు. కాంగ్రెస్ నుంచి వచ్చిన చేరిన హిమంత బిశ్వశర్మ అనే నేత కేసులను పట్టించుకోకపోవడమే కాదు ఏకంగా సీఎం పదవి కూడా ఇచ్చారు. బీజేపీలో చేరిన ఒక్కరిపైనా కేసులు ముందుకు సాగడం లేదు.

బీజేపీలో చేరకపోయినా పర్వాలేదు.. బీజేపీ సానుభూతిపరులైతే చాలు వాళ్లకు కేసుల నుంచి రక్షణ లభిస్తున్న అంశం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అదే బీజేపీని వ్యతిరేకించినా… వ్యతిరేకించే పార్టీలో ఉన్నా.. ఆ మూడు దర్యాప్తు సంస్థలకు టార్గెట్ అయినట్లే. ఇది అవినీతిని నిర్మూలించడం అని ఎవరూ అనుకోరు. కానీ ప్రధానమంత్రి మాత్రం .. తాను అదే పనిలో ఉన్నానని చెబుతున్నారు. దేశ ప్రజలకు మాత్రం ఆ మాటల్లో అంత నిజాయితీ కనిపించలేదు. ఎందుకంటే కళ్ల ముందు జరుగుతున్న వ్యవహారాలు ఆ తీరుగానే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close