గవర్నర్ రజనీకాంత్ !

రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని చివరి క్షణంలో ఆరోగ్య కారణాలతో విరమించుకున్న తమిళ సూపర్ స్టా‌ర్ రజనీకాంత్‌కు బీజేపీ బంపర్ ఆఫర్లు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లుగా తమిళనాట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానికి రజనీ కూడా అంగీకరించారని చెబుతున్నారు. ఆయనను దక్షిణాదిలోనే ఓ కీలకమైన రాష్ట్రానికి గవర్నర్ గా నియమించే చాన్స్ ఉందని చెబుతున్నారు.

దక్షిణాదిన పార్లమెంట్ సీట్లు పెంచుకోవడం ఇప్పుడు బీజేపీకి కీలకంగా మారింది. హిందీ రాష్ట్రాల్లో ప్రతీ సారి వందకు వంద సీట్లు సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అక్కడ కోత పడే సీట్లను దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలి. ఈ క్రమంలో తమిళనాడులో రజనీకాంత్ కోసం గతంలో ప్రయత్నించి విఫలమయింది. ఆయన అసలు రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు గవర్నర్ పదవి ఇవ్వడం ద్వారా ఆయన అభిమానుల్ని ఆకట్టుకుని రాజకీయంగా ఎదగాలని బీజేపీ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

రాజ్యాంగపరంగా గవర్నరే ప్రభుత్వాధినేత. ముఖ్యమంత్రి కాకపోయినా… ముఖ్యమంత్రి కన్నా పై పొజిషన్ సాంకేతికంగా అయినా వెళ్లవచ్చని ఆయనకు బీజేపీ చెబుతోంది. కొద్ది రోజుల కిందట… తమిళనాడు గవర్నర్ ను రజనీకాంత్ ను కలిసినప్పుడు ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నాన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని ఆయన ప్రకటించారు. ఏమీ లేకపోతే ఎందుకు కలుస్తారని చెప్పుకున్నారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా… రజనీకి గవర్నర్ ఆఫర్ వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఎప్పట్లాగే ప్రచారంతో ఆగిపోతుందా… నిజంగానే ఆయన గవర్నర్ అవుతారా అన్నది వేచి చూడాల్సిందే

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close