‘లైగ‌ర్‌’ త‌ర‌వాత రౌడీ బ్రేక్ తీసుకోవాల్సిందేనా?

విజ‌య్ దేవ‌ర‌కొండ దృష్టంతా ఇప్పుడు ‘లైగ‌ర్‌’ ప్ర‌మోషన్ల మీదే ఉంది. ఈ సినిమా అవ్వ‌గానే ‘ఖుషి’ సెట్స్‌లో పాల్గొనాలి. మ‌రోవైపు ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’ కూడా ఉంది. అయితే.. `లైగ‌ర్‌` త‌ర‌వాత విజ‌య్ కనీసం నాలుగు వారాల బ్రేక్ తీసుకోబోతున్నాడ‌ని టాక్‌. విజ‌య్ ప్ర‌స్తుతం విప‌రీత‌మైన న‌డుం నొప్పితో బాధ ప‌డుతున్నాడు. ఆ నొప్పిని పంటికింద బిగ‌బెట్టుకొని మ‌రీ ‘లైగ‌ర్‌’ ప్ర‌మోష‌న్ల‌లో ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా ఉన్నాడు. లైగ‌ర్ 25న వ‌చ్చేస్తోంది. త‌న ప్ర‌మోష‌న్ల ప‌ని అయిపోగానే.. మీడియాకు, సినిమాకూ, షూటింగుల‌కూ క‌నీసం నెల రోజులు దూరంగా ఉంబోతున్నాడ‌ట‌. ఆ త‌ర‌వాత మ‌రోసారి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకొని అప్పుడు `ఖుషి` సెట్స్‌కి ఎప్పుడు వెళ్లాలి? అనే నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని టాక్‌.

`లైగ‌ర్` మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో సాగిన సినిమా. ఈ సినిమాలోని బాక్స‌ర్ పాత్ర కోసం.. విజ‌య్ బాగా క‌ష్ట‌ప‌డ్డాడు, ప్రొఫెష‌ష‌న‌ల్ బాక్స‌ర్ల ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకొన్నాడు. ఈక్ర‌మంలో.. న‌డుం నొప్పి మొద‌లైంది. ఇప్పుడు అది భ‌రించ‌లేనంత‌గా మారింద‌ని తెలుస్తోంది. అందుకే `లైగ‌ర్` త‌ర‌వాత బ్రేక్ తీసుకోవ‌డం అత్య‌వ‌స‌ర‌మైంది. విజ‌య్ బ్రేక్ వ‌ల్ల `ఖుషి` షూటింగ్ లేట‌వుతుంది. ఈ డిసెంబ‌రులోనే `ఖుషి`ని రిలీజ్ చేయాల‌నుకొన్నారు. నెల రోజులు షూటింగ్ కి గ్యాప్ వ‌స్తే… ‘ఖుషి’ ఆల‌స్య‌మ‌య్యే అవకాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close