రాజాసింగ్‌ను గెంటేసిన బీజేపీ !

తెలంగాణలో బీజేపీకి నాలుగో ఆర్ వస్తాడనుకుంటే.. ఒక ఆర్‌ను పార్టీ నుంచి గెంటేసింది బీజేపీ. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. పది రోజుల్లో.. కొంత కాలంగా చేస్తున్న పార్టీ వ్యతిరేక పనులన్నింటికీ కారణాలంటో చెప్పకపోతే శాశ్తంగా పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. దీనంతటికి కారణంగా ఆయన యూట్యూబ్‌లో పెట్టిన వివాదాస్పద వీడియోనే.

ఇటీవల బీజేపీకి చెందిన నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే రాజాసింగ్ తీసుకు వచ్చారు. దీంతో బీజేపీ హైకమాండ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్పందించి సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వీడియో విషయంలో దేశవ్యాప్తంగా రాజాసింగ్‌పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు వెంటనే స్పందించి… యూట్యూబ్ నుంచ ఆ వీడియోను తొలగింప చేశారు. వెంటనే రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు.

ఇటీవల హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవొద్దని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆయన గతంలో హిందూ దేవుళ్లను అవమానిస్తూ స్టాండప్ కామెడీ చేశారని.. అందుకే ప్రదర్శనకు అంగీకరించబోమన్నారు. తనకు పార్టీ ముఖ్యం కాదని వాదించారు. ఇలాంటి వివాదంలోనే నుపుర్ శర్మతో పాటు మరో నేను బీజేపీ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వారి వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా భారత్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో వారిని తప్పించారు. ఇప్పుడు అదే తప్పు రాజాసింగ్ చేశారు. అయితే.. తనకు పార్టీ ముఖ్యం కాదని.. రాజాసింగ్ చెబుతూ వస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close