రైతు సదస్సంటే కేసీఆర్‌ను పొగడటమే!

తెలంగాణలో గొప్ప వ్యవసాయ విధానాలున్నాయని.. రైతుల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారని దేశం మొత్తం తెలిసేలా చేయడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భిన్నమైన మార్గాన్నిఎంచుకున్నారు. రైతు సంఘాల పేరుతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి చాలా మంది రైతుల్ని పిలిపించుకుని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జరుగుతోంది ఏమిటంటే.. తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా చేస్తోందని అహో.. ఓహో అని పొగడటం.

కేసీఆర్‌కి ఎవరితోనైనా పని పడితే వారిని ప్రగతి భవన్‌కు సాదరంగా ఆహ్వానిస్తారు. అద్భుతమైన ఆతిధ్యం ఇస్తారు. కలిసి భోజనం చేస్తారు. కొసరి కొసరి వడ్డిస్తారు. మూడు, నాలుగేళ్లపాటు అసలు ప్రగతి భవన్‌లోకే అడుగు పెట్టని కమ్యూనిస్టులకు ఇటీవల అక్కడ విందు భేటీలు జరిగాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉండల్లికీ అలాంటి ఆతిధ్యం లభించింది. వీరే కాదు చాలా మందికి అలాంటి ఆతిధ్యం లభించింది. కాకపోతే వాళ్లందరికీ కేసీఆర్‌తో పని పడాలి. కనీసం కేసీఆర్‌కు ఆ సమావేశాలు ఉపయోగపడాలి.

ఇప్పుడు ఉత్తరాది రైతు సంఘాల నేతలతోన కేసీఆర్‌కు చాలా పని పడింది. తెలంగాణలో వ్యవసాయ రంగం అద్భుతంగా ఉందని అక్కడికి వెళ్లి వీరంతా బ్రాండ్ అంబాసిడర్లులాగా ప్రచారం చేయాలి. అందుకే సాదరంగా ఆహ్వానించారు. రైతు సంఘాల నేతలతో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. తెలంగాణ రైతు సంక్షేమ, వ్యవసాయ, అభివృద్ధి విధానాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేసేలా అక్కడి ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తామని వారు భోజనం తర్వాత హామీ ఇచ్చారు. అంటే కేసీఆర్ లక్ష్యం నెరవేరినట్లే అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close