కుప్పం టీడీపీ ముఖ్యనేతలందరిపై కేసులు – అసలు ప్లాన్ ఇదే!

చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించారు. అందులో మొదటి రోజు ఘర్షణ పడ్డారు.రెండో రోజు బంద్‌కు పిలుపునిచ్చారు. కావాల్సినంత విధ్వంసం చేశారు. టీడీపీ నేతలను రెచ్చగొట్టారు. జరగాల్సింది జరిగింది. చంద్రబాబు కుప్పం దాటగానే.. టీడీపీ నేతలందర్నీ అరెస్ట్ చేయడం ప్రారంభించారు. కుప్పం ముఖ్య నేతలందరిపైనా కేసులు పెట్టేసి.. ఐదారు ప్రత్యేక బృందాలను పెట్టి అరెస్ట్ చేయడం ప్రారంభించారు. అదే నేరుగా దాడులు చేసిన వైసీపీ నేతలు ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసిన వారిపైనాకేసులు లేవు.

టీడీపీ నేతలపై కేసులే టార్గెట్‌గా చంద్రబాబు పర్యటనలో ఘర్షణల వ్యూహం వైసీపీ అమలు చేసినట్లుగా భావిస్తున్నారు. అందర్నీ కేసుల్లో ఇరికించడం ద్వారా ఎన్నికల సమయంలో వారిని బైండోవర్ చేయడంతో పాటు..పార్టీలో తిరగకుండా చేయవచ్చని వైసీపీ వ్యూహం అంటున్నారు. నిజానికి టీడీపీ నేతలు దాడులు చేశారో లేదో.. అసలు అక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నట్లుగా ముఖ్య నేతలందరిపైనా కేసులు పెట్టడం అనూహ్యంగా మారింది.

ఈ విషయాన్ని టీడీపీ ఎలా ఎదుర్కొంటుందో కానీ కుప్పం విషయంలో చంద్రబాబు సంప్రదాయ రాజకీయాలకు.. దాడులు.. దౌర్జన్యలు.. కేసులతో చెక్ పెట్టి గెలవడానికి వైసీపీ చేయాల్సినదంతా చేస్తుంది. టీడీపీ నేతలు తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తామని ఆవేశపడుతున్నారు కానీ అలాంటి సీన్ కోసం వైసీపీ ఎదురు చూస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close