ఏపీలోనూ ఢిల్లీ లిక్కర్ స్కాం నీడలు !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారని వారి వివరాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ విజయవాడలో మీటింగ్ పెట్టి సంచలన ఆరోపణలు చేసినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు అందరి దృష్టి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మల్సీ కవిత మీద ఉంది. ఇప్పుడు ఏపీలోనూ ఈ లిక్కర్ స్కాం జాడలు బయటపడుతున్నాయి. బీజేపీ నేతలు ఆరోపణలే చేశారు.. టీడీపీ నేతలు ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైఎస్ భారతి, విజయసాయిరెడ్డిలకు సంబంధం ఉందని కొన్ని పత్రాలు విడుదల చేశారు.

డిల్లీలో లిక్కర్ స్కాం కేసులో ఉన్న కంపెనీలకు ఆర్థిక సాయం చేసింది అరబిందో శరత్ చంద్రారెడ్డి. ఈయన విజయసాయిరెడ్డి వియ్యంకుడి సోదరుడు. వీరి ట్రైడెంట్ లైఫ్ సెన్సెస్ సాక్షిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. సీబీఐ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడీ కంపెనీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న పలు కంపెనీలకు పెట్టుబడి పెట్టింది. విజయసాయిరెడ్డిది టీడీపీ నేతలు చెబుతున్న అదాన్ డిస్టిలరీస్ కు చెందిన వారు కూడా ఈ స్కాంలో భాగమయ్యాయని .. టీడీపీ తరపున లిక్కర్ కేసుల వ్యవహారాలను చూస్తున్న ఆనం వెంకటరమణారెడ్డి ప్రకటించారు. ఈ వివరాలను ఆయన మీడియా ప్రతినిధులకు అందించారు.

ప్రస్తుతం సీబీఐ శరత్ చంద్రారెడ్డిని ప్రశ్నిస్తోందని ఆయన చెబుతున్నారు. లిక్కర్ స్కాంలో వైఎస్ భారతి, విజయసాయిరెడ్డి నిండా మునిగిపోయారని.. జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లడానికి ఈ కేసు వెలుగులోకి రావడమే కారణమని చెబుతున్నారు. ఈ కేసును లోతుగా విచారిస్తే.. ఏపీలో లిక్కర పాలసీ వ్యవహారాలన్నీ వెలుగుచూస్తాయంటున్నారు. అదాన్ డిస్టిలరీస్ ద్వారా ఏపీలో సేకరించిన వేల కోట్ల సొమ్మునే .. పెట్టుబడిగా పెడుతున్నారని.. ఆనం అంటున్నారు. అయితే అదేమీ చిన్న కాసే కాదని.. చాలా పెద్దదేనని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ర‌ణ‌భాలీ’గా రౌడీ దేవ‌ర‌కొండ‌?

విజ‌య్ దేవ‌ర‌కొండ - రాహుల్ సంకృత్యాన్ కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం 'ర‌ణ‌భాలీ' అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదో పిరియాడిక్ యాక్ష‌న్ డ్రామా....

‘హ‌రోం హ‌ర‌’.. కాస్త ఆల‌స్యంగా!

ఈనెల 31న రావాల్సిన సినిమా 'హ‌రోం హ‌ర‌'. అయితే అదే రోజున నాలుగైదు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. అందుకే 'హ‌రోం హ‌ర‌' ఈ పోటీ నుంచి త‌ప్పుకొంది. జూన్ 14న వ‌స్తున్న‌ట్టు చిత్ర‌బృందం...

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close