ఏపీలో తెలుగు వాడకపోతే జైలు !

తెలుగు మీడియం ఎత్తేసిన ఏపీలో తెలుగును వాడకకపోతే జైలు శిక్ష విధిస్తామంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ఉత్తర్వుల విప్లవంలో భాగంగా కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పాలనా భాషగా తెలుగును అమలు పర్చని అధికారులు, వ్యవస్థలకు జరిమానా, జైలు శిక్ష విధించే అధికారం ఉంది. ఈ విషయాన్ని అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ ప్రకటించారు.

దుకాణాలపైన తెలుగులో పేర్లు రాయకపోయినా జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే అసలు తెలుగు నేర్చుకోకుండా చేసి.. తెలుగు మీడియం రద్దు చేసి.. తెలుగులో ఉత్తర్వులు ఇవ్వకపోతే జరినిమా వేస్తాం.. బోర్డులు తెలుగులో రాయకపోతే జైలుకు పంపిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటన్న విస్మయం సహజంగానే అందరిలోనూ వ్యక్తమవుతోంది. మాతృభాషలో విద్యను నేర్పించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని.. జాతీయ విద్యా విధానం కూడా స్పష్టంచేసింది. కానీ తెలుగు మీడియంను రద్దు చేయడం కోసం .. ఏకంగా సీబీఎస్‌ఈ విధానాన్నే అమలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటిస్తోంది.

ఏ రాష్ట్రంలో అయినా మాతృభాషను ప్రాణంగా చూస్తూంటారు. మాతృభాషలో ప్రాథమిక చదువు ఉండేలా చూసుకుంటారు. కానీ ఏపీలో మాత్రం అసలు మాతృభాషను మృతభాషగా మార్చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో నేర్పకుండా ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలని.. బోర్డులు తెలుగులో పెట్టాలని జీవోలిస్తున్నారు. తాము తెలుగును కాపాడుతున్నామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి ఉత్తర్వులు నిబంధనలు గతంలోనే ఉన్నాయి..కానీ ఎవరు పాటిస్తున్నారు ? ఎవరు పట్టించుకుంటున్నారు ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close