వలంటీర్లే అన్నీ చేస్తున్నారు.. ఈసీకి కనిపించడం లేదా !?

ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లకు ఎలాంటి పనులు అప్పచెప్పకూడదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరోసారి ఆదేశాలు జారీ చేశారు . ఇలాంటి ఆదేశాలే ఆధార్‌తో ఓటర్ అనుసంధానానికి ముందు జారీ చేశారు. ఆధార్‌తో ఓటర్ అనుసంధానం చేసే పనుల్లో వాలంటీర్లు పాల్గొంటే చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఏపీలో జరుగుతోంది అదే. వాలంటీర్లే ఓటుకు ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. ఈ విషయంలో పదుల కొద్దీ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి సీఈవో దృష్టికి వచ్చాయేమో కానీ. మరోసారి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎవరు అమలు చేస్తారు ?

ఏపీలో అధికార పార్టీ ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను పెట్టుకుంది. ఆ యాభై ఇళ్ల సమాచారాన్ని వారి ఫోన్లలో నిక్షిప్తం చేసింది. వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి.. వారి సమాచారాన్నంతా వాలంటీర్లు గుప్పిట పట్టుకున్నారు. దీన్ని చూపించే ఎన్నికల సమయంలో ఓటర్లను బెదిరిస్తున్నారని పదే పదే ప్రచారం జరిగింది. పథకాలు ఆపేస్తామని హెచ్చరిస్తున్న ఆడియో.. వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఎన్నికల ప్రక్రియలో వారిని భాగస్వామ్యం చేయకుండా ఉండలేకపోయారు.

వలంటీర్లు అందరూ తమ పార్టీ కార్యకర్తలేనని వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వారు వైసీపీకి బహిరంగంగానే పని చేస్తున్నారు. ఇందులో దాపరికమేమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం ఖాయం. వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలన్న ఆదేశాలు జారీ చేస్తే సరిపోవు. వాటిని అమలు చేయడానికి అవసరమైన పటిష్టమైన చర్యలను ఈసీ తీసుకోవాలి. లేకపోతే.. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈటీవీ విన్… ఇలా అయితే కష్టమే!

'ఈనాడు' ఏ రంగంలో అడుగుపెట్టినా అగ్రగామిగా నిలవడానికే ప్రయత్నిస్తుంది. ఈ సంస్థ 'ఈటీవీ విన్' తో ఓటీటీలోకి ప్రవేశించింది. అయితే ఇప్పటివరకూ ఆ ఓటీటీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ లో '90s' తప్పితే...

అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

హైదరాబాద్ మెట్రోను విక్రయించేందుకు ఎల్ అండ్ టీ సిద్దమైందా..? నష్టాల పేరిట మెట్రోను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే మెట్రోను ఇప్పట్లో అమ్మకానికి పెట్టడం లేదని...2026 తర్వాత...

రాజమండ్రి లోక్‌సభ రివ్యూ : పురందేశ్వరి గెలుపు పక్కా !

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్న రాజమండ్రి లోక్ సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వచ్చిన...

ఎక్స్‌క్లూజీవ్: విజ‌య్ దేవ‌ర‌కొండ ‘డ‌బుల్ ట్రీట్’

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈనెల 9... విజ‌య్ పుట్టిన రోజున అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇదో పిరియాడిక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close