రాజకీయ ప్రవేశంపై ఖండించని వైఎస్ సునీత !

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె .. తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు. సొంత కుటుంబంలోనే అత్యంత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నారు. అయినా వెనక్కి తగ్గడం లేదు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడుతున్నారు. తమపై ప్రైవేటు కేసులు పెడుతన్నారు .. ఎదురు ఆరోపణలు చేస్తున్నారు… అయినా సరే ఎక్కడా తగ్గడం లేదు. తమ పోరాట పంథాలో తాను ఉన్నారు . ఇలా పోరాడుతున్నందుకు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లుపై ఆమె వచ్చే ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం చేస్తున్నారు.

తన తండ్రి హంతకులకు శిక్ష పడటానికి ఆమె చేస్తున్న పోరాటానికి.. రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధం ఏమిటో సజ్జల లాంటి వారే చెప్పాలి…కానీ సునీతారెడ్డి మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ప్రశ్నే లేదని ఖండించడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆమెను వైఎస్ భారతి నేతృత్వంలోని సాక్షి మీడియా బ్యాన్ చేసింది. కానీ ఇతర మీడియాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆ మీడియాలకు ఇస్తున్న ఇంటర్యూల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తే అది వైఎస్ కుటుంబంలో స్పష్టమైన చీలికకు దారి తీసే అవకాశం ఉందని పులివెందులలో చర్చ జరుగుతోంది. అవినాష్ రెడ్డి ఫ్యామిలీ మాత్రమే ఇప్పుడు జగన్ వెంట ఉంది. మిగిలిన వారంతా దూరమయ్యారు. జగన్ తమను పట్టించుకోవడం లేదని వారనుకుంటున్నారు. వారిని ఐక్యంగా ఉంచడంలో జగన్ విఫలమయ్యారని చెబుతున్నారు. అందుకే సునీత రాజకీయ రంగ ప్రవేశంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమన్నట్లుగా ఆమె చెబుతూండటంతో మరింత ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close