ఇంతకీ లాయర్లకు ఏపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చెంత!?

కింది కోర్టుల, జిల్లా కోర్టులు, సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా న్యాయస్థానాలన్నింటిలో ఏపీ ప్రభుత్వ కేసులు వందలు, వేలల్లో ఉంటాయి. కింది స్థాయిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకుంటారు. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో అయితే ప్రత్యేకంగా ఫీజులు కట్టి లాయర్లను మాట్లాడుకోవాలి. ఏపీ ప్రభుత్వం కొన్ని సార్లు కింది స్థాయి కోర్టుల్లో వాదించడానికి కూడా సుప్రీంకోర్టు లాయర్లను తీుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ అంశంపై తరచూ చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వం లాయర్ల కోసం వెచ్చించిన మొత్తాన్ని తెలుసుకునేందుకు నోటీసులు ఇస్తామని చెప్పడంతో అసలు ప్రభుత్వం పెట్టిన ఖర్చెంత అన్నదానిపై చర్చ ప్రారంభమయింది.

సుప్రీంకోర్టు ఒక్క పోలవరం అంశంపైనే నోటీసులు ఇస్తామని చెప్పింది కానీ ఇతర కేసుల్లో లాయర్లను మాట్లాడుకునే విషయంలో కాదు. అందుకే ఇతర కేసుల్లో లాయర్లకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోందనేది పెద్ద మిస్టరీ. సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లు గంటల్లో చార్జ్ చేస్తారు. అది లక్షల్లో ఉంటుంది. సీనియర్ లాయర్లను.. ప్రసిద్ధి చెందిన వారిని ఏపీ ప్రభుత్వం మాట్లాడుకుంటూ ఉంటుంది. చివరికి రఘురామ రాజును సీఐడీ అధికారులు కొట్టిన కేసుల్లాంటి వాటిలోనూ పెద్దపెద్ద లాయర్లను మాట్లాడుకోవడం గతంలో సంచలనం సష్టించింది. అమరావతి కేసులను వాదించడానికి ఏకంగా ఓ సారి రూ. ఐదు కోట్లు విడుదల చేశారు. ఆ తర్వాత లాయర్ల ఫీజులకు కోట్లకు కోట్లు విడుదల చేశారు. కానీ చాలా వరకూ గోప్యంగా ఉండిపోయాయి.

ఒక్క పోలవరం ఇష్యూలోనే లాయర్లకు రూ. వంద కోట్ల వరకూ ఖర్చు పెట్టి ఉంటారని పిటిషనర్ తరపు లాయర్.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా అక్కడి లాయరే కాబట్టి.. ఏదో సమాచారం ఉండే ఉంటుంది.. లేకపోతే సుప్రీంకోర్టు ధర్మాసనం ముందే వాదించరు. గతంలో అమరావతి కేసుల్లో తమ తరపున వాదించడమే కాకుండా..రైతుల తరపున వాదించకుండా ఉండటానికి ఇతర లాయర్లకు ఫీజులు చెల్లించారన్న ఆరోపణలువచ్చాయి. ఢిల్లీ న్యాయవర్గాల్లో ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలి… సీఎం తీరు మొదటి నుంచి చర్చనీయాంశమే. ఇప్పుడు ఈ విషయం .. మరింత హాట్ టాపిక్ అవుతుంది.

సుప్రీంకోర్టు అడిగినా..,ప్రభుత్వం లెక్కలు చెప్పదు. ఇప్పటి వరకూ జరిగింది అదే. ప్రభుత్వం మారితే.. మొత్తం ఆడిట్ చేయించి… లెక్కలు బయటపెడితే కానీ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఘనకార్యాల గురించి బయటకు తెలియదు. కొసమెరుపేమిటంటే.. జగన్ తరపున వ్యక్తిగతంగా అక్రమాస్తుల కేసులు వాదించే లాయర్‌ ఇప్పుడు వైసీపీ తరపున రాజ్యసభ సభ్యునిగా ఏపీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close