మాట మార్చిన ‘జిన్నా’

గాడ్ ఫాద‌ర్‌, ది ఘోస్ట్ సినిమాల‌తో పాటుగా… జిన్నా కూడా రిలీజ్ కానుంద‌ని ఓ వార్త చ‌క్క‌ర్లు కొట్టింది. ఏకంగా మెగాస్టార్‌పైనే పోటీగా దిగ‌డానికి మంచు విష్ణు సిద్ధ‌మ‌య్యాడ‌ని, అందుకే ఈ రిస్క్ తీసుకొన్నాడ‌ని అన్నారు. విష్ణు కూడా ‘అక్టోబ‌రు 5న వ‌స్తున్నా’ అంటూ ఓ హింట్ ఇచ్చాడు. అక్టోబ‌రు 5 ద‌గ్గ‌ర ప‌డుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌మోష‌న్లు ప్రారంభించ‌లేదు. స‌రిక‌దా.. ఇప్పుడు మాట మార్చాడు. “అక్టోబ‌రు 5న వ‌స్తున్నా అన్నా.. కానీ సినిమా రావ‌డం లేదు. ట్రైల‌ర్ వ‌స్తోంది. అక్టోబ‌రు 21న మా సినిమాని విడుద‌ల చేస్తామ‌“ని ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు విష్ణు. ఈరోజు… మీమర్స్‌, ట్రోల‌ర్స్ తో ఓ మీటింగ్ పెట్టుకొన్నాడు విష్ణు. త‌న‌ని ట్రోల్ చేసేవాళ్ల‌తో.. ఓ ప్రెస్ మీట్ పెట్ట‌డం బ‌హుశా.. విష్ణుకే సాధ్య‌మేమో..? ఈ సంద‌ర్భంగా కొత్త రిలీజ్ డేట్ ప్రక‌టించాడు. దాంతో పాటు.. ట్రోలర్స్‌కి ఓ విన్న‌పం అంటూ… త‌న మ‌న‌సులోని బాధని బ‌య‌ట‌పెట్టాడు.

“సినిమా బాగాలేక‌పోతే తిట్టండి.. విమ‌ర్శించండి. నేను ఏమీ అనుకోను. కానీ ఫ్యామిలీల‌ను మాత్రం ఇందులోకి లాక్కండి. ప్ర‌తీ ఒక్క‌రికీ కుటుంబాలు ఉన్నాయి. ఆ సంగ‌తి గుర్తు పెట్టుకోండి“ అని మీమ‌ర్స్‌ని కోరాడు విష్ణు. అన్న‌ట్టు ఈ సినిమా తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల అవుతోంది. క‌న్న‌డ‌, త‌మిళ సీమ‌ల్ని విష్ణు ఎందుకు వ‌దిలేశాడో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close