గాడ్ ఫాదర్ ఈవెంట్ వర్షార్పణం

చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రిరిలీజ్ ఈవెంట్ కోసం అనంతపురంని వేదికగా చేసుకున్నారు. భారీ సెట్ వేశారు. వేలాది మంది అభిమానులు వచ్చారు. అయితే ఎంతో కలర్ ఫుల్ గా జరగాల్సిన ఈ ఈవెంట్ వర్షార్పణం అయ్యింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి కాస్త ఆలస్యంగా వచ్చారు. ఈ గ్యాప్ లో డ్యాన్సులు సాంగ్స్ తో టైం పాస్ చేశారు. అయితే చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన పది నిమిషాలకే వర్షం దంచికొట్టింది. దీంతో సడన్ గా ఈవెంట్ ని ముగించేయాల్సి వచ్చింది. దర్శకుడు మిగతా నటులు ఎవరూ మాట్లాడలేదు. అయితే అంతటి వర్షంలో కూడా కొందరు అభిమానులు ఈవెంట్ లో నిలబడ్డారు. అటు చిరు కూడా వర్షంలో కూడా ఓపిక తెచ్చుకొని చాలా సుదీర్గంగా మాట్లాడారు. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. తాను ఎప్పుడు రాయలసీమకి వచ్చినా నేల తడుస్తుందని, ఈ రోజు కూడా వర్షం కురవడం ఒక శుభపరిణామంగా చెప్పారు.

గాడ్ ఫాదర్ లో పొలిటికల్, ఫ్యామిలీ డ్రామా వుంటుంది. ఈ రెండు కలసి ప్రేక్షకులుని ఆద్యంతం అలరిస్తుంది. సినిమాని చూశాను కాబట్టి ఇంత నమ్మకంగా చెబుతున్నాను. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 విజయదశమి నాడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించి గొప్ప విజయాన్ని ఇవ్వాలి. ఈ మధ్య చేసిన చిత్రం కాస్త నిరాశ పరిచింది. మిమ్మల్ని సరిగ్గా అలరించలేకపోయాననే అసంతృప్తి వుంది. దీనికి సమాధానమే ఈ సినిమా. గాడ్ ఫాదర్ నిశ్శబ్ద విస్పోటనం. మీ అందరి ఆశీస్సులు కావాలి. అలాగే అదే రోజు నా మిత్రుడు నటించిన నాగార్జున ది ఘోస్ట్, యువ హీరో గణేష్ నటిస్తున్న స్వాతిముత్యం చిత్రాలు వస్తున్నాయి. ఈ చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలి’ అని కోరారు చిరు. ఏదేమైనా ఎంతో కలర్ ఫుల్ గా జరగాల్సిన ఈ వేడుకని వరుణుడు దెబ్బకొట్టాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

ఒక్క కేసీఆర్ మాటలే వినిపించాయా – అదీ నెల తర్వాత !

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close