గోపీచంద్ – శ్రీ‌నువైట్ల‌… ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

చాలా కాలం నుంచి హిట్టు కోసం ప‌రిత‌పిస్తున్నాడు శ్రీ‌నువైట్ల‌. గోపీచంద్ ప‌రిస్థితి కూడా అంతే. ఇప్పుడు వీరిద్ద‌రూ జ‌ట్టు క‌ట్ట‌బోతున్నారు. `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` త‌ర‌వాత ఓ స్క్రిప్టు ఓకే చేయించుకొని, హీరోని ప‌ట్టుకోవ‌డానికి తంటాలు ప‌డుతున్నాడు శ్రీ‌నువైట్ల‌. ఎట్ట‌కేల‌కు గోపీచంద్ ఈ క‌థ‌కు ఓకే చెప్పాడ‌ని టాక్ నడుస్తోంది. బివిఎస్ ర‌వి ఈ చిత్రానికి క‌థ అందించాడ‌ని స‌మాచారం. బీబీఎస్ ర‌వికీ… గోపీచంద్ కీ మ‌ధ్య ఓ చేదు జ్ఞాప‌కం ఉంది. అదే ‘వాంటెడ్‌’. ర‌చ‌యిత ర‌వి.. ద‌ర్శ‌కుడిగా మారి మెగా ఫోన్‌ప‌ట్టింది ‘వాంటెడ్‌’ సినిమాతోనే. అది ఫ్లాప్ అయ్యింది.

గోపీచంద్ కోసం శ్రీ‌నువైట్ల‌, బివిఎస్ ర‌వి ఇద్ద‌రూ క‌లిసి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థ‌ని రెడీ చేశారని తెలుస్తోంది. శ్రీ‌నువైట్ల బ‌లం కామెడీ. త‌న సినిమా ఫ్లాప్ అయినా ఎంట‌ర్‌టైన్‌మెంట్ బాగుంటుంది. లాజిక్కులు వెదుక్కోకుండా హాయిగా చూసుకొని న‌వ్వుకోవొచ్చు. అయితే.. ఎందుక‌నో.. శ్రీ‌నువైట్లకు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటే మొహం మొత్తేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ కూడా సీరియ‌స్‌గా సాగే క‌థే. అందులోనూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉండ‌దు. అద‌స‌లు శ్రీ‌నువైట్ల మార్క్ సినిమానే కాదు. అందుక‌నే బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఫెయిల్ అయ్యింది. శ్రీ‌ను మ‌ళ్లీ పాత స్కూలులోకి వెళ్లి సినిమాలు తీయాల‌ని అనుకొంటున్న స‌మ‌యంలో.. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని ఎంచుకొన్నాడెందుకో మ‌రి..?!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close