టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమవబోతున్నారట !

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అవబోతున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోక్యం చెప్పారు. మరొకరితో చర్చలు జరుపుతున్నారని ఆయన కూడా రెడీ అయితే అందరూ కలిసి వెళ్లి విలీనం అయిపోతారని రేవంత్ అంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. ప్రగతి భవన్ లో ఉండి ప్రగతి సాధించిన హ్యాపీరావు నేతృత్వంలో అది జరగనుందని.. కేటీఆర్ ఆ సంగతి చూసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

హ్యాపీ రావు అంటే ఎంపీ సంతోష్ రావు ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చెప్పి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇటీవల సంతోష్ రావు సన్నిహితులపై ఈడీ దాడులు జరగడంతో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రగతి భవన్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఒకరిద్దరు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ గా రేవంత్ ఈ విషయాన్ని చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ ఎంపీలుపార్టీలు మారుతారన్న గుసగుసలు మాత్రం ఎప్పుడూ బయటకు రాలేదు.

గతంలో టీడీపీ ఎంపీలు కూడా ఇలాగే వెళ్లి బీజేపీలో విలీనం అయ్యారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి టీఆర్ఎస్ వస్తుందని రేవంత్ చెబుతున్నారు. ఇందులో ఎంత నిజముందో స్పష్టత లేదు కానీ నిప్పు లేనిదే పొగరాదని కొంత మంది చెబుతున్నారు. జాతీయ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలతో పోల్చుకుంటే.. బీజేపీనే బెటరనిఎంపీలు ఫీలైతే మాత్రం ఇది త్వరలోనే జరగొచ్చన్న అంచనాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close