ఆదివారం జనసేన పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం మంగళగిరి పార్టీ ఆఫీసులో పీఏసీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇటీవలి పరిణామాలతో సభ్యులతో విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఇటీవల పవన్ కల్యాణ్.. చంద్రబాబు మధ్య సమావేశం జరిగింది. చంద్రబాబుతో పవన్ ఫేస్ టు ఫేస్ అరగంట వరకూ మాట్లాడారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను పవన్.. పీఏసీ ముందు ఉంచే అవకాశం ఉంది. భవిష్యత్ వ్యూహంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పోలీసులను ప్రయోగించి.. ప్రభుత్వం చేస్తున్న నిర్బంధాలను కలసి కట్టుగా ఎదుర్కోవాలని జనసేన ఇప్పటికే నర్ణయించింది. పవన్ కళ్యాణ్ బస్సు యాత్రను కూడా సజావుగా జరిగేలా సహకరిస్తారని ఆ పార్టీ నాయకులు అనుకోవడం లేదు. అందుకే బస్సు యాత్ర విషయంలో ఎలాంటి వ్యూహం అవలంభించాలి.. పోలీసులు అడ్డుకుంటే ఏం చేయాలన్నదానిపైనా చర్చించే అవకాశం ఉంది. విశాఖలో జరిగిన ఘటనల్లో పూర్తిగా పోలీసులు ఓవరాక్షన్ చేశారని .. వారిపై ప్రైవేటు కేసులు వేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఆ కార్యచరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పవన్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు,మంత్రులు చేసిన వ్యాఖ్యల పై కూడ చర్చించాలని నాయకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్‌సీపీ నేతలు పూర్తిగా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. పవన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ.. మూడు పెళ్లిళ్ల అంశంపై ప్రతీ రోజూ ఏదో ఓ కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ అంశంపై మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది. వీటిపైనా చర్చించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close