ఏపిలో ఇక డీలర్ల వద్దే కొత్త వాహనాలకు శాశ్విత రిజిస్ట్రేషన్లు

ఆంధ్రప్రదేశ్ లో వాహన కొనుగోలుదార్లకు శుభవార్త. డీలర్ల వద్దే కొత్త వాహనాలకి ఆన్-లైన్ ద్వారా శాశ్విత రిజిస్ట్రేషన్ చేయించుకొనే వెసులుబాటు రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుండి అమలులోకిరాబోతోంది. మొదట ప్రయోగాత్మకంగా ఈ ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని విశాఖలో అమలుచేసి పరిశీలించి చూస్తారు. అది విజయవంతం అయితే వెంటనే రాష్ట్రంలో అన్ని జిల్లాలలోను అదే విధానాన్ని అమలుచేస్తామని రాష్ట్ర రవాణాశాఖ కమీషనర్ ఎన్.బాలసుబ్రమణ్యం మీడియాకి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

ఇంతవరకు డీలర్ల వద్దే కొత్త వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు శ్వాసిత రిజిస్ట్రేషన్ కూడా చేయగలిగితే వాహన యజమానులు రవాణాశాఖ కార్యాలయం చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రేపు ఈ నూతన విధానాన్ని ప్రారంభించే అవకాశం ఉందని కమీషనర్ బాలసుబ్రమణ్యం చెప్పారు. డ్రైవింగ్ లైసెన్సుల పొందేందుకు నిర్వహించే పరీక్షల కోసం త్వరలో కియోస్క్ లను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించే ట్రాక్ ల వద్ద రవాణాశాఖ అధికారి అభ్యర్ధుల తప్పొప్పులను పరీక్షిస్తుంటారు. దాని కోసం డ్రైవింగ్ ట్రాక్ ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని మొదట విజయవాడలో ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

ఆ ఇద్దరు మంత్రులతో రేవంత్ కు గ్యాప్ పెరుగుతుందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సంబంధిత మంత్రులు లేకుండా రేవంత్ సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. బుధవారం సచివాలయంలో వ్యవసాయ...

బీఆర్ఎస్ దీన స్థితికి ఇది మరో సాక్ష్యం !

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కసరత్తు కోసం బీఆర్ఎస్ చేపట్టిన సమావేశానికి పట్టు మని నలభై మంది నేతలు రాకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియచేస్తోంది. బీజేపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close