పొత్తులపై అతి చేస్తున్న బీజేపీ నేతలకు జనసేన పంచ్ !

ప్రధాని మోదీతో అలా భేటీ ముగిసిందో లేదో ఇలా ఏపీ బీజేపీ నేతలు అతి చేయడం ప్రారంభించారు. ఇక తెలుగుదేశంపార్టీతో జనసేన పొత్తే లేదని.. తమతోనే కలిసి పోటీ చేస్తుందని హంగామా చేయడం ప్రారంభించారు. సోము వీర్రాజు నుంచి విష్ణువర్ధన్ రెడ్డి వరకూ ఒకటే క్యాసెట్ వేశారు. జనసేనలోని .. ” పవనన్నను ప్రేమిస్తాం.. జగనన్నకు ఓటు వేస్తాం” బ్యాచ్ కూడా ఏమీ వెనక్కి తగ్గలేదు. ఇక వైసీపీ అనుకూల మీడియా సంబరం అంతా అంతా ఇంతా కాదు.

అయితే వీటన్నింటికీ జనసేన అధికారికంగా సమాధానం ఇచ్చింది. మోదీతో జరిగిన సమావేశం విషయంలో.. ప్రధానిని గౌరవిస్తామని.. ఒక్క విషయం కూడా బయటకు చెప్పబోమని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మోదీ, పవన్ ఏం చర్చించారు.. పొత్తులపై ఏం తేల్చాలంటూ మీడియాతో పాటు ఇతర పార్టీల నేతలు చేస్తున్న కామెంట్లను నాదెండ్ల కొట్టి పడేశారు. అవన్నీ అర్థరహితమన్నారు. పొత్తుల గురించి ఎన్నికల సమయంలో మాత్రమే మాట్లాడతామన్నారు. మూడు రోజుల నుంచి ఒకటే మ్యూజిక్‌ను .. వైసీపీతో పాటు ఆ పార్టీ ప్రో మీడియా.. బీజేపీ నేతలు ఇదే చెబుతూండటంతో జనసేన అధికారికంగా క్లారిటీ ఇచ్చినట్లయింది.

మోదీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్… విజయనగరం జిల్లా గుంకలాం వెళ్లినప్పుడు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. వైసీపీని ఎదుర్కొనే పార్టీ తమదేనన్నారు. అలాగే చంద్రబాబు కూడా.. తానేమీ సినిమా యాక్టర్‌నుకాదని అయినా వెల్లువలా జనాలు వచ్చారని కర్నూలులో కామెంట్ చేశారు. దీంతో గతంలో కలిసి వైసీపీపై పోరాడదామనే మాటలకు బ్రేక్ పడిందన్న అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యాప్తి చేయడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు వైసీపీ ముక్త ఏపీ కోసమే పని చేస్తామని నాదెండ్ల తేల్చేయడంతో ఇప్పటికైతే .. పొత్తులపై చర్చకు చెక్ పడినట్లేనని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close