కవితను షిండే చేద్దామనుకున్న బీజేపీ నేత ఎవరు !?

తన కూతుర్ని కూడా బీజేపీలో చేరమని అడిగారని కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యల్ని కవిత సమర్థించారు. తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేనన్నారు. షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడం పై మాట్లాడారన్నారు. ” షిండే మోడల్ ” అంటే.. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే .. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలను తనతో పాట తీసుకు పోయి.. తనదే శివసేన అని ప్రకటించుకున్నట్లుగా రాజకీయం మార్చడం. కవితను అలా షిండే తరహాలో రాజకీయం చేయాలన్న ఆఫర్ ఇచ్చినట్లుగా కవిత చెబుతున్నారు.

తెలంగాణ రాజకీయాల్లోనూ షిండేలు ఉన్నారని గతంలో బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రకటించారు. వారంతా సమయం చూసి బయటకు వస్తారని ప్రకటించారు. ఈ షిండేల వ్యాఖ్యలపై కేసీఆర్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇదేం పద్దతని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు భయపడి వెళ్తే ఓ పది మంది వెళ్తారని అంతే కానీ.. షిండేల్లా ఎవరూ ఉండరన్నారు. అయితే ఆ షిండేను నేరుగా కేసీఆర్ కుటుంబం నుంచే వచ్చేలా ప్రయత్నించిందని బీజేపీ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే ఎవరు సంప్రదించారు ? ఎలాంటి చర్చలు జరిగాయి ? అన్న వివరాలను కవిత ఇంకా బయట పెట్టలేదు.

దీనిపైనే టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఫామ్ హౌస్ కేసులో విచారణ జరుపుతున్న సిట్ తక్షణం … కవితను పిలిపించి స్టేట్ మెంట్ నమోదు చేసుకుని ఎవరు ఆమెను సంప్రదించారో తెలుసుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే..బీజేపీ, టీఆర్ఎస్ ఆడుతున్న నాటకమే ఇదంతా అనుకోవాల్సి వస్తుందన్నారు. కవిత నేరుగా చెప్పారు.. తమను సంప్రదించారని.. అలాంటప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదనేది ఇప్పుడు కీలకం. అయితే ఈ విషయాలను సిట్ చీఫ్ పట్టించుకుంటారా అన్నదే ఇప్పుడు ప్రశ్న.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close