షర్మిల, కవితల పొయెటిక్ రాజకీయం !

పాత సినిమాల్లో పోరాటం అంటే పద్యాలు, కవితలతో ఒకరినొకరు విమర్శించుకోవడమే. ఇప్పుడు సీన్ మారిపోయింది. రాజకీయాల్లో అయితే.. బూతులే విమర్శలుగా చెలామణి అవుతున్నాయి. అయితే.. తెలంగాణలో ఇద్దరు మహిళా నేతలు మాత్రం.. కవితలతో విమర్శలు చేసుకుని మళ్లీ పాత కాలం సినిమాలను గుర్తు చేశారు. ఈ కవితల విమర్శల రాజకీయానికి ముందుగా కల్వకుంట్ల కవితనే ప్రారంభించారు.

ఉదయం ఆమె షర్మిల, బీజేపీని కలిపి పరోక్షగా విమర్శిస్తూ.. తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అంటూ ట్వీట్ పెట్టారు. ఇందులో నేరుగా విమర్శించలేదు. కానీ ఎవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది.. రెండు రోజులుగా జరుగుతున్న డ్రామా అంతా.. బీజేపీ, షర్మిల కలిసి చేస్తున్నారని కవిత చెప్పారు. దీంతో షర్మిల వెంటనే స్పందించారు. ” పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు..” అంటూ కౌంటర్ ఇచ్చారు.

అయితే సాహిత్యంలో తండ్రికి తగ్గ తనయగా కాకపోయినా మంచి అభిరుచి ఉన్న నేతగా పేరు తెచ్చుకుని జాగృతిని నడుపుతున్న కవిత ఊరుకుంటారా.. వెంటనే.. కాస్త పొడవైన కవితతోనే కౌంటర్ ఇచ్చారు. అమ్మా.. కమల బాణం అటూ ప్రారంభించి.. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని.. మీరు కమలం కోవర్టు ..ఆరేంజ్ ప్యారేట్టు అని పేరడీలతో.. తాను ఉద్యమంలో నుంచే పుట్టానని తేల్చారు. కవిత ట్వీట్‌ను టీఆర్ఎస్ నేతలు వైరల్ చేసుకున్నారు.

ఇప్పటికైతే షర్మిల ఇంకా ఎలాంటి కవితతో రిప్లయ్ ఇవ్వలేదు. మంచి రైటర్ దగ్గర్నుంచి పంచ్ కవిత కోసం చూస్తున్నారేమో కానీ..,అది వచ్చాక రిప్లయ్ ఇవ్వొచ్చు. మొత్తానికి షర్మిల, కవితల సాహిత్య రాజకీయం మాత్రం వైరల్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close