అయ్యోపాపం.. సగం మంది ఐఏఎస్, ఐపీఎస్‌లకూ జీతాలు రాలేదట !

జీతాలు మహా ప్రభో అని సగం మందికిపైగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడ ఉద్యోగులు అంతా వచ్చి తమపై దాడి చేస్తారేమోనని ఉద్యోగ సంఘ నేతలు మేము తల్చుకుంటే ప్రభుత్వాన్ని నిలేస్తాం.. కూల్చేస్తామనే ప్రకటనలు చేస్తూ .. వీడియోలు లీక్‌లు చేసుకుంటూ సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు ఉద్యోగులు కాదు.. సగం మంది సివిల్ సర్వీస్ అధికారులకూ జీతాలు రాలేదట . ఈ విషయం ఆ సర్వీస్ అధికారులు గగ్గోలు పెడుతూంటే బయటకు వచ్చింది.

కేంద్రం నుంచి రావాల్సిన రూ. వెయ్యి కోట్ల నిధులు రాలేదు. ఎందుకంటే పాత బాకీలున్నాయి.. జమ చేసుకున్నామని ఆర్బీఐ నుంచి సమాధానం వచ్చింది. ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన జీతాల బిల్లు పెండింగ్‌లో ఉన్నది రెండున్నర వేల కోట్లని చెబుతున్నారు. ఆ వెయ్యి కోట్లిస్తే ఎలాగోలా సర్దుబాటు చేయాలనుకున్నారు. కానీ రాకపోయే సరికి మొదటికే మోసం వచ్చింది. సివిల్ సర్వీస్ అధికారలూ జీతాల కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రతీ నెలా మంగళవారం అప్పులు తీసుకోవడం.. జీతాలివ్వడం అనే ప్రాసెస్ జరుగుతోంది. ఇప్పుడు అప్పులు దక్కడం లేదు. ఏడాది మొత్తం చేయాల్సిన అప్పును ఆరు నెలల్లో చేసేశారు. ఆ సంస్కరణలు.. ఈ సంస్కరణలు అని చెప్పి.. ఉన్న అప్పు మొత్తం లాగేశారు. ఈ నెల మొదట్లో ఆర్బీఐనుంచి కొంత… ఏరో కార్పొరేషన్ పేరుతో మరో బ్యాంక్ నుంచి రెండు వేల కోట్లు తెచ్చి సామాజిక పెన్షన్లు.. ఇతర పథకాలకు సరి పెట్టారు. ఇప్పుడు జీతాలకు మాత్రం రోజువారీ ఆదాయంపై ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుత లెక్కల ప్రకారం.. పదిహేనో తేదీ వరకూ అందరికీ జీతాలు ఇస్తూ పోతారని చెబుతున్నారు.

కేంద్రం కొత్త అప్పులకు పర్మిషన్ ఇవ్వకపోతే.. బ్యాంకులు ఏదో ఒకటి తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వకపోతే.. ఏపీ పరిస్థితి వచ్చే మార్చి వరకూ దారుణంగా ఉంటుంది. ఆ తర్వాత కొత్త అప్పులకు పర్మిషన్ వస్తుంది కాబట్టి.. నాలుగైదు నెలలు జల్సా చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close