అసెంబ్లీలో చీఫ్ మార్షల్ కూడా ఏడుకొండల రెడ్డే !

ఏపీ అసెంబ్లీలో చీఫ్ మార్షల్‌ను నియమించారు. ఆయన పేరు ఏడుకొండలు రెడ్డి. వైసీపీ వచ్చిన తర్వాత ధియోఫిలిప్ ను నియమించారు. విపక్ష సభ్యుల విషయంలో మార్షల్స్ దారుణంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆయనను సొంత శాఖకు పంపేసి.. ఏడుకొండలు రెడ్డి ని నియమించారు. ఆయనకు కూడా ప్రమోషన్లు ఇచ్చి మరీ ఈ పదవికి ఎంపిక చేసినట్లుగా కనిపిస్తోంది.

అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు హాజరు కావడం లేదు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు. మొత్తం టీడీపీ తరపున గెలిచిన 23 మందిలో గట్టిగా 18 మంది కూడా యాక్టివ్‌గా లేరు. మిగతా వారు వైసీపీకి మద్దతు ప్రకటించడమో.. సైలెంట్‌గా ఉండటమో చేస్తున్నారు. కానీ 150 మందికిపైగా బలం ఉన్న వైసీపీ.. ఈ కొద్ది మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఎదుర్కోవడానికి నానా తంటాలు పడుతోంది. తాను మొదట వైసీపీ కార్యకర్తనని..తర్వాతే స్పీకర్‌నని నేరుగా చెప్పుకునే తమ్మినేని సీతారాం చాలా సార్లు కంట్రోల్ తప్ప ప్రతిపక్ష నేత మాదిరిగా స్పీకర్ చైర్ నుంచే విమర్శలు చేస్తూంటారు.

ఇక చీటికి మాటికి.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి.. ఎత్తేయండి అని స్పీకర్ .. మార్షల్స్ ను ఆదేశించడం సభ జరిగినప్పుడల్లా ప్రతీ రోజూ కనిపించేదే. ఇప్పుడు అంతా ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో అసెంబ్లీలో మార్షల్స్ పని మరింత ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నారేమో కానీ .. తమవారిని నియమించుకున్నారు. ప్రస్తుతం పని చేసే పనులు.. పదవుల్లో… ఏ పేరు చూసినా… చివరి రెండు అక్షరాలు ఒకటే వినిపిస్తూంటాయి. అది కామన్. ఈ విషయంలోనూ అదే నిజం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు ఇది అవ‌స‌ర‌మా అధ్య‌క్షా..?!

ఏ ఆటైనా మైదానంలో జ‌ట్టు స‌భ్యులంతా స‌మ‌ష్టిగా ఆడితేనే అందం, విజ‌యం. ఒక‌రిపై మ‌రొక‌రు క‌స్సుబుస్సులాడుతుంటే, క‌య్యానికి కాలుదువ్వుతుంటే, అస‌లు జ‌ట్టు స‌భ్యుల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోతే - ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా త‌ల‌ప‌డ‌తారు?...

విజ‌య్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో ఓ కొత్త కాంబోకి తెర లేవ‌నుందా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించ‌బోతున్నారా? ఆ అవ‌కాశాలు ఉన్నట్టే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో...

విశ్వసనీయత కోల్పోతున్న కేసీఆర్…?

అనేక ఆటుపోట్లను ఎదుర్కొని రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలిపిన కేసీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోతున్నారా..?ఇందుకు కారణం ఆయన వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలేనా..? అంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close