కాంగ్రెస్ వ్యూహకర్తను అరెస్ట్ చేసే ప్లాన్‌లో తెలంగాణ పోలీసులు !

కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ , కోర్ టీం సభ్యుడు అయిన సునీల్ కనుగోలును అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కవితపై లిక్కర్ క్వీన్ అంటూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులను కాంగ్రెస్ సోషల్ మీడియా టీం పెట్టిందని ఆరోపిస్తూ పోలీసులు .. సునీల్ కనుగోలు టీం ఉన్న కార్యాలయంపై దాడి చేశారు. అందులో ఉన్న కంప్యూటర్లన్నీ ఎత్తుకెళ్లడంతో పాటు నలుగురు ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ భ గ్గు మంది పార్లమెంట్‌లోనూ తెలంగాణ పోలీసుల తీరును కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావించారు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

ఈ అంశంపై పోలీసులు వివరణ ఇచ్చారు. మహిళల్ని కించ పరిచేలా పోస్టింగులు పెట్టారని.. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు కానీ.. ఇలా మార్ఫింగ్‌లతో పోస్టింగ్‌లు పెట్టడం నేరమని చెప్పారు. ఫిర్యాదు అందిందని.. నోటీసులు కూడా ఇచ్చామని.. ఆ తర్వాతే అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. తాము అరెస్ట్ చేసిన ఉద్యోగులు.. సునీల్ కనుగోలు చెబితేనే మార్పింగ్‌లు చేశామని చెప్పారని.. ఆయనకూ నోటీసులు ఇస్తామని ప్రకటించారు.

ఈ అంశాన్ని కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. ఏ పోస్టులు పెట్టారని కేసులు పెట్టారో.. అవే తాను కూడా పెడుతున్నానని ఎంపీ మాణిగం ఠాగూర్ సవాల్ చేసి అవే పోస్ట్ చేశారు. దమ్ముంటే తననూ అరెస్ట్ చేయాలన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తోంది. సునీల్ కనుగోలు ఢిల్లీ స్థాయిలో … కాంగ్రెస్ కు స్ట్రాటజీలు రూపొందిస్తున్నారు. రాహుల్ పాదయాత్రలో కీలకంగా ఉంటున్నారు. అందుకే అరెస్ట్ చేయాలనుకుంటున్నారని రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగమంటున్నారు.

నిజానికి టీఆర్ఎస్ నేతలు.. బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు చేసే పోస్టింగ్‌లు.. మరీ అభ్యంతరకంగా ఉంటాయి. కవితను లిక్కర్ క్వీన్ అంటూ ఢిల్లీలో బీజేపీ నేతలు ఎన్ని సార్లు ట్రెండింగ్ చేశారో లెక్కలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పోస్టులు పెట్టగానే.. సునీల్ కనుగోలు ఆఫీస్‌ను సీజ్ చేసేసి.. కంప్యూటర్లు తీసుకెళ్లిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close