వరస్ట్ స్టేట్‌గా పరోక్షంగా ఏపీ గురించి నిర్మల కామెంట్స్ !

”ఒక రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఉద్యోగులంతా నిరసనలు చేస్తున్నారు. సదరు ప్రభుత్వం భారీ ప్రకటనలకు డబ్బులు ఖర్చు చేస్తోంది. మీకు ఆదాయం ఉంటే ఉచితాలు ఇవ్వొచ్చు. కానీ అప్పులు చేసి ఇవ్వడం కాదు” ఈ మాటలు వింటే ఎవరికైనా గుర్తు వచ్చేది ఏపీ ప్రభుత్వమే. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతోంది ఏపీ ప్రభుత్వం. అంతే కాదు..భారీగా ప్రకటనలకూ ఖర్చులు చేస్తోంది. అప్పులు చేసి మరీ ఉచితాలకు పంచి పెడుతోంది. అందుకే అందరూ నిర్మలా సీతారామన్ అన్నది ఏపీనేనని తేల్చారు.

నిజానికి నిర్మలా సీతారామన్ ఈ అంశాన్ని చెప్పాల్సిన పని లేదు. సభలో వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై స్పందించారు. కానీ ప్రత్యేకంగా ఏపీని గుర్తు చేసేలా.. చెబుతూ..అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పడం మాత్రం చాలా మందిని ఆశ్చర్య పరించింది. ఏపీలో ఆదాయం పెరగకపోగా.. ఖర్చులు మాత్రం రెట్టింపు అవుతున్నాయి. కట్టాల్సిన వడ్డీ భారం పెరిగిపోతోంది. ఓడీల మీదనే ప్రభుత్వం ఆధారపడుతోంది.

కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితిని ఆరు నెలల్లో పూర్తి చేస్తున్న ప్రభుత్వం.. కార్పొరేషన్ల పేరుతో అడ్డగోలుగా రుణాలు చేస్తోంది. వీటికి సంబంధించిన వివరాలు ఆర్బీఐకి పంపడం లేదు. దీంతో కొన్ని అదనపు రుణాలకు అనుమతి పొందుతున్నారు. కేంద్రానికి బ్యాంకుల నుంచి ప్రత్యేకంగా నివేదికలు అందుతున్నా.. వేల కోట్లు రుణాలిస్తున్నారని తెలుస్తున్నా.. నిరోధించడం లేదు. తమకు మద్దతుగా ఉంటున్న వైసీపీకి వారు మద్దతుగా ఉంటున్నారు. కానీ ఏపీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని చెప్పకనే చెబుతున్నారు. అంటే ఏపీ అలా అయిపోవడానికి వారి కూడా భాగం ఉందన్నట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close