ఢిల్లీ లిక్కర్ స్కాం పరిణామాలపై ఆందోళనలో కవిత !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజులు గడిచే కొద్దీ తన పాత్రపై ఒక్కొక్క విషయాన్ని సీబీఐ, ఈడీ బయట పెడుతూండటంతో కవిత తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తున్నారు. తనకు పరిచయం ఉన్న మీడియా సంస్థలు, ప్రభుత్వం , టీఆర్ఎస్ తరపున భారీగా ప్రకటనలు ఇస్తున్న మీడియా సంస్థల యాజమాన్యంతో నేరుగా టచ్ లో కి వెళ్లి.. తనపై వార్తల్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతలు ఎవరైనా తనపై విమర్శలు చేస్తే.. ఏ మాత్రం ఆగకుండా కౌంటర్ ఇస్తున్నారు.

ఉదయం రాజగోపాల్ రెడ్డి లిక్వర్ క్వీన్ అని సంబోధిస్తూ.. ట్వీట్ చేశారు. దీనిపై కవిత.. మర్యాదగానే మాట జారకు అన్నా అని కాస్త ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించారు. నిజం నిప్పులాంటిదని.. జైలుకెళ్లక తప్పదన్నారు. తనను మునుగోడు ఎన్నికల సమయంలో వేధించారని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా విమర్శలు గుప్పించారు. ఆయనకూ కవిత రిప్లయ్ ఇచ్చారు. బీఆర్ఎస్ .. ఎక్కడ బీజేపీ పుట్టి ముంచుతుందోననే బయంతోనే తనను టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు.

మరో వైపు కవిత ఈడీ చార్జిషీటు అంశంపై సీఎం కేసీఆర్ మరోసారి ప్రగతి భవన్ లో చర్చలు జరిపారు. న్యాయనిపుణులతోనూ మాట్లాడారు. ఇండో స్పిరిట్ కంపెనీలో కవితనే అసలైన వాటాదారు అని ఈడీ గట్టిగా చెప్పడంతో… ఎలా ఈ పరిస్థితిని అధిగమించాలన్నదానిపై న్యాయనిపుణులు మేధోమథనం జరుపుతున్నారు. త్వరలో ఈడీ కవితను విచారించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో రాజకీయంగా కవిత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గురువారం ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అయితే బీజేపీపై ఆరోపణలు ..ఎదురుదాడి చేయడానికే అవకాశం ఉంది. ఎలా చూసినా ఈ పరిణామాలతో కవిత తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close