ఒక్క ఓటుకు మూడు రాష్ట్రాలు చేస్తున్న వైసీపీ

వైసీపీకి ఒక్క ఓటు వేసినందుకు విభజిత ఏపీని మూడు రాష్ట్రాలు చేసేస్తోంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడంలో చివరికి ప్రత్యేక రాష్ట్రం అనే నినాదానికి వచ్చేశారు. ఇప్పటికే రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర వాదనను ఆ పార్టీ నేతలు వినిపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఉత్తరాంధ్రలోనూ ప్రారంభించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఎలాగైనా మనసుల్లో ప్రత్యేక రాష్ట్రం అనే బీజం నాటారంటే.. రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు వాటిని పెంచుకునే నేతలు ఉంటూనే ఉంటారు. అందుకే.. ఒక్క సారి ఓటు వేసినందుకు.. వైసీపీ .. విభజన ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేయడానికి పునాదులు వేసేసినట్లయింది.

తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని టీడీపీ నడిపింది. అమరావతి రాజధానిని ఏకగ్రీవంగా అందరితో ఆమోదింప చేసి నిర్మాణం ప్రారంభించారు. ప్రతీ ప్రాంతానికి పరిశ్రమలు, అభివృద్ధి వికేంద్రీకరించింది. ఒక్క చోట ప్రాంతీయ ఉద్యమం రాలేదు. కానీ ఘనత వహించిన వైసీపీ అధినేత సీఎం జగన్ కాగానే.. ప్రాంతీయ ఉద్యమాగల చిచ్చు పెట్టారు. ఎవరూ అడగకపోయినా..మూడు రాజధానులు ప్రకటించేశారు. ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. ఈ మూడు రాజధానులకు అభివృద్ధికి సంబంధం ఏమిటో ఎవరికీ తెలియదు.. వైసీపీ చెప్పదు.. కానీ మూడు రాజధానులు అడ్డుకున్నారంటూ విద్వేషాలు మాత్రం పెంచుతున్నారు.

ఎలా చూసినా ప్రాంతీయ ఉద్యమాలు భవిష్యత్ లో ఏపీని రావణ కాష్టం చేయడం ఖాయంగా కనపిస్తోంది. అధికారం అందని పార్టీలు వీటిని అందుకుంటాయి. అందులో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇప్పుడే వైజ్ గా ఆలోచించాలి. రాయలసీమ.. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ష్రాలను ఏర్పాటు చేయాలి.కోస్తా ప్రాంత వాసుల ప్రత్యేక రాష్ట్రం అడగకపోయినా విడిపోతామంటే..కలిసి ఉండాలని వారు ఉద్యమాలు చేయరు. అందుకే ఒక్క ఓటుతో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ఘనతను దక్కించుకోవాలంటే.. వైసీపీకి ఒక్కటే మార్గం.. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడం. అది చేసేస్తే.. పతనం సంపూర్ణం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెరపైకి క్రికెటర్ క్యారెక్టరైజేషన్

ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ గుర్తున్నాడా? మెరుపు వేగంతో బంతులు వేసే బాలాజీ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. ఆయన సీరియస్ గా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపుగా ఆయన స్మైల్ ఫేస్...

పట్టభద్రుల బైపోల్..ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థుల బెడద..?

లోక్ సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికపైనే నెలకొంది. ఈ నెల 27న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానానికి బైపోల్ జరగనున్న నేపథ్యంలో ఈ...

‘పుష్ష‌’పై ఫ‌హ‌ద్‌కు ఇంత చిన్న చూపా?

'పుష్ష' టీమ్ ని ఫ‌హ‌ద్ ఫాజ‌ల్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. త‌న డేట్లు ఇస్తే కానీ 'పుష్ష 2' షూటింగ్ పూర్త‌వ్వ‌దు. ఆయ‌నేమో డేట్లు ఇవ్వ‌డం లేదు. ఇది వ‌ర‌కే ఫ‌హ‌ద్ గంప‌గుత్త‌గా...

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close