కేసీఆర్ అసలు సాక్ష్యాలు రిలీజ్ చేయలేదట !

ఫామ్ హౌస్ కేసులో బీజేపీ బండారం అతా బయటపెడతానంటూ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. గంటల కొద్దీ వీడియో ఫుటేజీని విడుదల చేశారు. వాటన్నింటినీ అన్ని రాష్ట్రాల చీప్ జస్టిస్‌లకు.. సుప్రీంకోర్టుకు కూడా పంపుతున్నట్లుగా ప్రకటించారు. ఇదంతా బహిరంగం. అయితే ఇప్పుడు అనూహ్యంగా అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ కేసులో ఎలాంటి సాక్ష్యాలు రిలీజ్ చేయలేదని చెప్పుకోవాల్సి వస్తోంది. కోర్టులను కూడా నమ్మించాల్సిన పరిస్థితి వచ్చింది.

హైకోర్టు సింగిల్ బెంచ్ ఫామ్ హౌస్ కేసును సీబీఐకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐకి ఇవ్వవొద్దని హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందు ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. ఈ అప్పీల్ పై విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాది అసలు కేసీఆర్ సాక్ష్యాలు రిలీజ్ చేయలేదని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చి ఉంటారని చెప్పారని..కానీ అలా జరగలేదని ప్రభుత్వం తరపు లాయర్ న్యాయమూర్తికి వివరించారు. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కోర్టుకు సరైన సమాచారం అందించలేకపోయారని చెప్పారు.

సీఎం ప్రెస్ మీట్ కు ముందే ఆ వీడియోలు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కేవలం ముఖ్యమంత్రి మీడియా సమావేశాన్ని సాకుగా చూపి కేసులో సీబీఐకు అప్పగించడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుంటే పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అందుకే ప్రెస్ మీట్ పెట్టారని వాదించారు. ఈ కేసు వ్యవహారం చుట్టూ తిరిగి కేసీఆర్, పోలీసు ఉన్నతాధికారుల దగ్గరు వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్న సమయంలో అసలు పబ్లిక్ డోమైన్‌లో ఉన్న వాటినే కేసీఆర్ రిలీజ్ చేశారని.. ఆయనకు ఎవరూ ఇవ్వలేదని వాదించడం ప్రారంభించారు. వాదనలు శుక్రవారం కూడా జరగనున్నాయి. సీబీఐ విచారణకే కట్టుబడాలా లేక సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలా అన్నది చీఫ్ జస్టిస్ బెంచ్ నిర్ణయం తీసుకోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close