హైకోర్టులో రోజూ అక్షింతలే – ఏపీ ప్రభుత్వం సిగ్గుపడదా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నుంచి అక్షింతలు పడని రోజంటూ లేదు. ఏపీ ప్రభుత్వ నిర్వాకంపై బాధితులు కోర్టును ఆశ్రయించడం.. . అలాంటి విషయాల్లో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్రంగా స్పందించడం కామన్ గా మారిపోయింది. సలహాదారుల దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ హైకోర్టు గట్టిగా వాతలు పెడుతోంది. నిన్నటికి నిన్న ఓ కాంట్రాక్టర్ … ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణగా అప్పలు పాలై.. బంధువుల ఇంట్లో దొంగతనం చేసిన వ్యవహారం సంచలనం సృష్టించింది. దీన్ని హైకోర్టు ప్రస్తావించింది. ఇక పించన్ దార్లను పిక్ పాకెటర్లుగా మారుస్తారా అని మండిపడింది. ఓ ప్రభుత్వం ఇంత దారుణంగా విమర్శలకు గురయిందంటే… నైతికంగా పతనమైనట్లే. అయితే ఏపీ ప్రభుత్వం ఎప్పుడో ఈ స్థితికి చేరింది. నైతికత అనేదే లేకుండా పోయింది.

ఇక ఎస్సీ కార్పొరేషన్ నిధుల దారి మళ్లింపుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్రంగా ఉన్నాయి. నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. దళిత యువతకు ఉపాధి కల్పించడం లేదు. ఏమన్నా అంటే నవరత్నాల పథకాల కింద నిధులు ఇస్తున్నామని చెబుతారు. అందరికీ ఇచ్చే పథకాలనే ఎస్సీలకు ఇస్తూ… అవే ఎస్సీ కార్పొరేషన్ నిధులని మళ్లిస్తున్నారు. దీంతో దళితులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది.

ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయం హైకోర్టు స్పష్టంగా బయట పెడుతోంది. బాధితులు ఎవరు హైకోర్టును తలుపు తట్టినా న్యాయం అందించడానికి ప్రయత్నిస్తోంది. కానీ రాజ్యం మాత్రం హైకోర్టును … పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆదేశాలు అమలు చేయడం లేదు. కోర్టు ధిక్కరణకు సిద్ధ పడుతోంది కానీ బాధితులకు న్యాయం చేయడం లేదు. ప్రభుత్వం అన్యాయం చేస్తే హైకోర్టు దాకా వచ్చే బాధితులు తక్కువే. ఒక్క శాతం కూడా ఉండరు. అలాంటి వారికీ కోర్టులు చెప్పినా ప్రభుత్వ న్యాయం చేయడం లేదు.

గతంలో ఏదైనా ప్రభుత్వం హైకోర్టు ఓ ఘాటు వ్యాఖ్య చేస్తే సిగ్గుపడేవి. తప్పు చేస్తున్నామని అనుకునేవి. కానీ ఇప్పటి ప్రభుత్వానికి అవేమీ లేవు. ఇంకా ఎదురు హైకోర్టును తప్పు పట్టే పరిస్థితి వచ్చింది..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బెంగళూరు రేవ్ పార్టీ…వారిని తప్పించే ప్రయత్నం జరుగుతోందా..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులను తప్పించే ప్రయత్నం జరుగుతుందా..? ఈ విషయంలో మొదట దూకుడుగానే స్పందించిన బెంగళూరు పోలీసులు ఆ తర్వాత సైలెంట్ కావడానికి...

గేమ్ ఛేంజ‌ర్‌లో ‘జ‌న‌సేన‌’?

రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'గేమ్ ఛేంజ‌ర్‌'. ఇదో పొలిటికల్ డ్రామా. ఇందులో రామ్ చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులుగా క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రి పాత్ర‌కు రాజ‌కీయ...

తొలిసారి మీడియా ముందుకు ‘క‌ల్కి’

ఈ యేడాది విడుద‌ల కాబోతున్న అతి పెద్ద ప్రాజెక్టుల‌లో 'క‌ల్కి' ఒక‌టి. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ అభిమానులే కాదు, యావ‌త్ సినీ లోకం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. అయితే ఈ చిత్రానికి...

పూరి… హీరోల లిస్టు స్ట్రాంగే!

త‌ర‌వాత ఎవ‌రితో సినిమా చేయాల‌న్న విష‌యంపై పూరి జ‌గ‌న్నాథ్ పెద్ద‌గా ఆలోచించ‌డు. ఎందుకంటే పూరి స్టామినా అలాంటిది. త‌ను ఫ్లాపుల్లో ఉన్నా ఎవ‌రికీ లొంగ‌డు, భ‌య‌ప‌డ‌డు. ఇండ‌స్ట్రీలో ఉన్న ఏ హీరోతో అయినా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close