చైతన్య : కళ్ల ముందు కనిపించేవి కూడా కళ్లార్పకుండా అబ్దదాలు – ఇదేంది సీఎం సార్ ?

సీఎం జగన్ ప్రజలకు తెలియదని అనుకుంటున్నారో.. తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని అనుకుంటున్నారో లేకపోతే… పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నట్లుగా ఫీలవుతున్నారో కానీ… అసువుగా అబద్దాలు చెప్పేస్తున్నారు. నాకు మీడియా లేదంటారు. తనకు ఆస్తులు లేవంటారు. పేదవాడినంటారు. మంచివాడినంటారు. చెడు చేసిన వాళ్లకూ మంచే చేస్తానంటారు. రాజకీయాలు చెడిపోయాయంటారు.. తన నివాసం ఇక్కడే ఆయన మాటలు వింటూ ఉంటే… చేస్తున్న చేతలనూ పోల్చుకుంటే చాలా మందికి .. అపరిచితుడులో రామం గుర్తుకొస్తారు. కానీ ఇంత బహిరంగంగా కనిపిస్తున్నా జగన్ ఎందుకిలా అబద్దాలు చెబుతున్నారు.

పేపర్లు, టీవీలు జగన్‌కు లేవా ? నమ్మేవాళ్లుంటారా ?

తనకు టీవీలు, పేపర్లు లేవని జగన్ చెబుతూ ఉంటారు. కళ్ల ముందు ఆయన తండ్రి వైఎస్ ఫోటోను పెట్టుకున్న మీడియా ఉంటుంది. ఆయన భార్య చేతుల్లోనే ఉంది అది. ఆ మీడియా వ్యవస్థాపకుడు జగన్. రూపాయిపెట్టుబడి పెట్టకుండా నిర్మించిన సామ్రాజ్యం అది. అయినా తనకు లేదంటారు. ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఆయనకు సొంత మీడియా కాకుండా కూలి మీడియా కూడా ఉంది. వేల మందితో సోషల్ మీడియా సైన్యం ఉంది. అందరికీ తెలుసు. కానీ ఏమీ లేదని అమాయకంగా చెప్పి ఎవర్ని నమ్మిస్తారు ?

ఏపీలోనే ఆయనకు నివాసమా ? ఇంకెక్కడా లేదా..? ఎవరికీ తెలీదా ?

జగన్మోహన్ రెడ్డి తనకు ఇక్కడే నివాసమని ఇంకెక్కడా లేదని బహిరంగసభల్లో చెబుతున్నారు. ఆయన అసలు పుట్టి పెరిగింది బెంగళూరులో. బెంగళూరులో యలహంకలో ఆయనకు ఉన్న ప్యాలెస్ గురించి కథలు కథలుగా చెబుతారు. ఇల లోటస్ పాండ్ గురించి చెప్పాల్సిన పని లేదు. సీఎం అయ్యాక చెన్నైలోనూ ఓ ప్యాలెస్ కట్టించారు. ఇప్పుడు విశాఖలో ప్రజాధనంతో రుషికొండపై కడుతున్నారు. కడప, పులివెందుల, ఇడుపులపాయ, తాడేపల్లి ఇలా ప్రతీ చోటా ఓ ప్యాలెస్ ఉంది. అయినా.. ఎందుకలా ఆయన అమాయకంగా ఫేస్ పెట్టి ప్రజలకు చెబుతారో ?

తనకు కీడు చేసిన వారికీ మేలుచేస్తారట !

జగన్మోహన్ రెడ్డి అంటే… రాజకీయాల ను వ్యక్తిగత కక్షలుగా చేసుకుని పరిచయం లేని వాళ్లను కూడా అడ్డగోలుగా వేధించిన చరిత్ర ఉన్న నేత. ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి అందరికీ తెలుసు. ఆయనది విపరీత మనస్థత్వమని… మానసిక నిపుణులు విశ్లేషించాల్సిన పని లేదు. ఏపీలో జరుగుతున్న ఘటనలే నిరూపిస్తాయి. అయినా తనది కీడు చేసిన వారికీ మేలు చేసే మనస్థత్వమని సొంతంగా చెప్పుకుంటారు. అమాయకంగా ఇలా చెబితే నమ్మేస్తారా ?

రాజకీయాలు చెడిపోయాయంటారు !

అధికారంలోకి రావడానికి ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశారో.. ఎన్ని ఫేక్ హామీలు ఇచ్చారో కళ్ల ముందు కనిపిస్తోంది. సీపీఎస్ రద్దు నుంచి జాబ్ క్యాలెండర్ వరకూ అన్నీ ఫేకే. తాను చెప్పిన విలువల ప్రకారం రాజీనామా చేయాల్సింది పోయి… తనను విమర్శిస్తున్నందున రాజకీయాలు చెడిపోయాయంటారు. సీఎం ఇలా అనడానికి రెండే కారణాలు ఉంటాయి.. ఒకటి ప్రజల్ని ఓ మాదిరిగా కూడా అంచనా వేయకపోవడం…. రెండు ఆయనో విచిత్రమైన మానసిక పరిస్థితిలో .. మాయా ప్రపంచంలో బతకడం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close