“ఫామ్‌హౌస్‌”పై సీబీఐ కేసు ఇక్కడ కాదు ఢిల్లీలోనే !

ఫామ్ హౌస్ కేసులో సీబీఐ అధికారులు కేసును ఢిల్లీలోనే నమోదు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేయాలంటే .. ఆయా రాష్ట్రాల్లోనే నమోదు చేస్తారు. కానీ ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సీబీఐ ఢిల్లీలో కేసు నమోదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం తెలంగాణలో సీబీఐకి ప్రభుత్వం జనరల్ కన్సెంట్ రద్దు చేయడమే.

అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సీబీఐ విచారణ జరిపితే జనరల్ కన్సెంట్ ఉన్నా లేకపోయినా ఒక్కటే. కానీ ప్రాథమికంగా అనుమతి మాత్రం ప్రభుత్వం ఇవ్వాలి. కానీ అప్పీల్ చేసుకున్నందున ఆ తీర్పు వచ్చే వరకూ అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదు. సీబీఐ లేఖ రాసినా ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఢిల్లీలో కేసు నమోదు చేయాలని ఆలోచిస్తున్నారు. ఢిల్లీలో కేసు నమోదు చేసినా హైదరాబాద్ కేంద్రంగా విచారణ చేయనున్నారు.

ఈ కేసును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే విచారణ ప్రారంభమైతే.. చాలా సీరియస్ గా సాగుతుందని అంటున్నారు. హైదరాబాద్ సీబీఐ అధికారులు కాకుండా ఢిల్లీ స్థాయి సీబీఐ అధికారులు విచారణ జరుపుతారని అంటున్నారు. ప్రస్తుతం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. అక్కడ తీర్పు వచ్చిన తర్వాత సీబీఐ దూకుడు చూపించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close