బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తే వెలుగు జిలుగుల భారత్ : కేసీఆర్

బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తే వెలుగు జిలుగుల భారత్ తయారు చేస్తామని భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభలో కేసీఆర్ తెలుగులో దేశ ప్రజలకు హామీ ఇచ్చారు ఇదొక్కటే కాదు.. ఆయన మార్క్ హామీలు ఈ సభలో వరదలా ప్రవహించాయి. దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్. .. రైతు బంధు పథకం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు.
దళిత బంధు పథకాన్ని ఇప్పుడే అమలు చేయాలని కేంద్రాన్ని డి్మాండ్ చేశారు. చేయకపోతే… తాము వచ్చాక చేస్తామన్నారు. మహిళలను 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు.

ఇక బీఆర్ఎస్ గెలవగానే ప్రతి ఇంటికి మంచి నీళ్లు వస్తాయని.. అగ్నిపథ్ రద్దు చేసి.. పాత పద్దతిలోనే సైన్యం నియామకాలు చేస్తామని ప్రకటించారు. ఇత విశాఖ ఉక్కు, ఎల్ఐసీని అమ్ముతామంటున్నారని.. అమ్మేసినా తాము రాగానే జాతీయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్ సంస్థలనూ ప్రైవేటీకరణ చేస్తున్నారని.. తాము పబ్లిక్ సెక్టార్ లోనే ఉంచుతామన్నారు. ఈ రంగాల వాళ్లంతా బీఆర్ఎస్‌కు పిడికిలి ఎత్తి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.

భారత్‌ సమాజం లక్ష్యం ఏంటి అని ఆలోచిస్తే అసలు తెలియడం లేదని.. భారత్ తన లక్ష్యాన్ని కోల్పోయిందా… దారి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి సంపద ఉందన్నారు. ప్రపంచ బ్యాంకు, అమెరికా, విదేశీయుల అవసరం లేని.. ఈ దేశ ప్రజల సొత్తు. లక్షల కోట్ల, రూపాయల ఆస్తులు ఉన్నాయన్నారు. అన్నీ ఉండి కూడా ఎందుకు యాచకులం కావాలని కేసీఆర్ ప్రశ్నించారు. దేశం సుసంపన్న కావాలంటే ప్రజలకు ఉచితంగా అన్నీ అందాలంటే.. బీఆర్ఎస్ రావాల్సిందేనన్న సందేశాన్ని కేసీఆర్ బీఆర్ఎస్ సభ ద్వారా ఇచ్చారు.

పనిలోపనిగా ఖమ్మంకు వరాల జల్లు కురిపించారు. ఖమ్మంలో జిల్లాలో 589 గ్రామ పంచాయితీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయితీకి పది లక్షలు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ది వేల జనాభాకు మించిన ఉన్న మేజర్ పంచాయతీలకు పది కోట్ల రూపాయలు . మున్నేరు నదిపై కొత్త బ్రిడ్జి . ఇతర మున్సిపాలిటీలకు తలో 30 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఖమ్మం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేశామని ప్రకటించారు. ఖమ్మం హెడ్‌ క్వర్టర్స్‌లో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయితే గతంలో ఇలాంటి ప్రకటనలుకేసీఆర్ వందల సార్లు చేశారు కానీ.. జరిగింది తక్కువే. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలివ్వాలని సుప్రీంకోర్టు కేసు క్లియర్ చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు.

కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావ సభ అయినా మొత్తం తెలుగులోనే ప్రసంగించారు. మరి దేశ ప్రజలకు తన సందేశం హామీలు ఎలా అర్థమవుతాయని అనుకున్నారో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close