గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్ర.. బీబీసీ డాక్యుమెంటరీ – బ్యాన్ !

2002 గుజరాత్‌ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీ సోషల్ మీడియాలో కనిపించకుండా ప్రభుత్వం బ్యాన్ చేసింది. అల్లర్లకు మోదీనే బాధ్యుడని బ్రిటన్‌ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని బీబీసీ తేల్చింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్‌ను గురువారం యూట్యూబ్‌ లో అప్‌లోడ్‌ చేసింది. అయితే, అప్‌లోడ్‌ చేసిన కొద్ది గంటల్లోనే కేంద్ర ఐటీశాఖ ఈ వీడియోను తొలగించింది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేయడానికి, ప్రచారంలో భాగంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందని కేంద్రం ఆరోపించింది.

ఈ బీబీసీ డాక్యుమెంటరీ లింక్‌లను తీసివేయాలనిట్విట్టర్ , యూట్యూబ్‌లను కూడా కేంద్రం ఆదేశించింది. కేంద్రం ఆదేశాల ప్రకారం “ఇండియా: ది మోడీ క్వశ్చన్” అనే డాక్యుమెంటరీకి సంబంధించిన అనేక ట్వీట్లు మరియు యూట్యూబ్ వీడియోలు ఇకపై మైక్రోబ్లాగింగ్ మరియు వీడియో-షేరింగ్ వెబ్‌సైట్‌లలో కనిపించడం లేదు. నేరుగా బీబీసీకే కేంద్రం తన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే బీబీసీ మాత్రం చాలా లోతుగా అధ్య‌య‌నం చేసి ఆ డాక్యుమెంట‌రీ తీసిన‌ట్లు స్పష్టం చేసింది.

ఆ బీబీసీలో ఎంత నిజాలున్నాయో.. ఎన్ని అబద్దాలున్నాయో ప్రజలు తెలుసుకోకుండా కేంద్రమే చేయడం ఆశ్చర్యకరంగా మారింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టక ముందు ప్రపంచంలో ఆయన ఇమేజ్ చాలా తేడాగా ఉండేది. ఆయనకు ప్రపంచంలోని ప్రముఖ దేశాలు వీసాలు ఇచ్చేవి కావు. అయితే ఆ ఆల్లర్లలో ఆయన పాత్ర లేదని ఇటీవలే కేంద్ర దర్యాప్తులు సంస్థలు తేల్చాయి. కానీ అంతర్జాతీయ సమాజం మాత్రం నమ్మడం లేదు. ప్రభుత్వాల రహస్య విచారణల్లో.. ఆయన పాత్ర తేలిందని బీబీసీ లాంటి వేదికలు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీని నిషేధించడం వల్ల…. దీని గురించి మరింత విస్తృత ప్రచారం జరిగే అవకాశాన్ని కేంద్రమే కల్పించినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

ఓటేస్తున్నారా ? : పోలవరం వైపు ఓ సారి చూడండి !

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కరువులో నిండా మునిగిపోవాలో.. కనీసం రైతుల కడుపు నింపుకోవాలో తేల్చుకోవాల్సిన సంధి స్థితిలో ఉంది. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఓట్లు వేశారు. ఐదేళ్లలో ఏం...

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close