సైకోయిజం : వాళ్ల చెక్కును వెనక్కి పంపేసిన అంబటి !

బిడ్డ డ్రైనేజీ పనుల్లో చనిపోతే… వచ్చిన ఐదు లక్షల్లో రూ. రెండున్నర లక్షలు వాటా అడిగిన అంబటి రాంబాబు వ్యవహారం గత నెలలో సంచలనం అయింది. తనకు ఇమ్మన్న రెండున్నర లక్షలు ఇవ్వకుండా మీడియాకు ఎక్కి రచ్చ చేస్తారా అని పగబట్టిన అంబటి రాబాబు… వారికి మంజూరైన చెక్కును వెనక్కి పంపేశారు. ఇప్పుడు ఆ బాధితులకు చెక్కు అందలేదు. పరిహారం వెనక్కి పోయిందని చెబుతున్నారు. మంజూరైన చెక్కును ఇవ్వకుండా…. వెనక్కి పంపిన అంబటి వ్యవహారశైలి ఇప్పుడు సత్తెనపల్లిలో చర్చనీయాంశం అవుతోంది.

కన్నబిడ్డను కోల్పోయిన వాళ్లు .. వచ్చే పరిహారంతో అయినా ఎలాగోలా బతకాలనుకున్నారు. కానీ రాజకీయ రాబందులు వారిని బతకనివ్వడం లేదు. అంబటి రాంబాబు రెండున్నర లక్షలు అడిగారని జనసేన నాయకుల సాయంతో వారు మీడియా ను ఆశ్రయించారు. దీంతో అయినా ఉలిక్కి పడి.. ఆ బాధితులకు న్యాయం చేశామని నిరూపించుకోవాల్సిన ప్రభుత్వం వారికి చెక్కులు ఇవ్వలేదు. నిజానికి ఆ చెక్కు మంజూరు అయింది. ఆర్డీవో దగ్గరకు వచ్చింది. ఇక పంపిణీ చేయడమే మిగిలింది. కానీ వాటా ఇవ్వకపోవడం వల్ల రాజకీయ ఆదేశాలతో ఆగిపోయింది.

ఆ బాధితులు మీడియాకు ఎక్కడంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు. తమ సొమ్మేదో ఇస్తున్నట్లుగా వారు వెంటనే.. కుట్రలు ప్రారంభించారు. ఆ చెక్కు కనిపించడం లేదని చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు వెనక్కి పంపేసినట్లుగా చెబుతున్నారు. దీంతో ఆ తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. అసలు పాలనలో సైకోయిజం అంటే ఇదేనని మండి పడుతున్నారు. తమ బిడ్డ ఉసురు పోసుకుంటారని శాపనార్ధాలు పెడుతున్నారు. కానీ పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికే పాలన అన్నట్లుగా ఉన్న ఈ రాజకీయ నాయకులకు అవేమీ కనిపించడం లేదు… వినిపించడం లేదు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close