విజయసాయిరెడ్డి అసలు క్యారెక్టర్ మళ్లీ బయటకు !

లోపల క్యారెక్టర్ అలాగే ఉంది.. బయటకే మంచిగా కనిపిస్తున్నా అని విజయసాయిరెడ్డి మరోసారి నిరూపించారు. కొన్నాళ్లుగా ఆయన తాను మారిపోయినట్లుగా.. పెద్ద మనిషినన్నట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పార్లమెంట్‌లో అసలు క్యారెక్టర్ ను బయటకు తీశారు. నేరుగా న్యాయవ్యవస్థను టార్గెట్ చేశారు. ఏపీలో హైకోర్టు పరిధి దాటిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి ఉందని.. అలాంటి శాసన అధికారం రాష్ట్రానికి లేదంటూ కోర్టు తీర్పు చెప్పిందని ఆయన ఆరోపించారు. ఇంకా పలు రకాల కామెంట్లు చేశారు.

విజయసాయిరెడ్డి కామెంట్లను రాజ్యసభ చైర్మన్ ధన్ ఖడ్ ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేశారు. న్యాయవ్యవస్థపై చేస్తున్న విమర్శలకు ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. అయినా విజయసాయిరెడ్డి తన ధోరణిలో తాను ముందుకెళ్లిపోయారు. ఇలా మాట్లాడటం ద్వారా న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు సహజంగానే వస్తున్నాయి. గతంలో కూడా విజయసాయిరెడ్డి ఇలా న్యాయవ్యవస్థపై నిందలేశారు. త్వరలో సుప్రీంకోర్టులో విచారణకు రానున్న సమయంలో ఇలాగే మాట్లాడారు.

నిజానికి రాజధాని విషయంలో హైకోర్టు రిట్ ఆఫ్ మాండమస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నరైతుల హక్కును భక్షిస్తోందన్న కారణంగానే ఆ రిట్ ఆఫ్ మాండమస్ ను హైకోర్టు ఇచ్చింది. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. అయినా సరే అటు జగన్ కానీ.. ఇటు విజయసాయిరెడ్డి కానీ ఎవరూ న్యాయవ్యవస్థను గౌరవించకుండా.. రాజ్యాంగాన్ని లెక్క చేయనట్లుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ తీరు న్యాయవర్గాల్లోనూ విస్తృత చర్చకు కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close