చైతన్య : జగన్‌లో స్పష్టంగా ఓటమి భయం !

అప్పట్ల ో వెంట్రుక కూడ పీకలేరని సవాల్ చేసిన సీఎం జగన్ డైలాగుల్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పొత్తులనేవి రాజకీయ వ్యూహాల్లో భాగం. పొత్తులు పెట్టుకోవద్దని ఇతర పార్టీల్ని సవాల్ చేయడం అంటే… తమ ఓటమిని తాము ఒప్పుకోవడమే. కేంద్రంలో మోదీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ కూటమిని ఏర్పాటు చేసుకుంది. కానీ బీజేపీ ఎప్పుడూ ఒంటరిగా రావాలని కాంగ్రెస్ పార్టీని సవాల్ చేయలేదు. కూటమిగా పోటీ చేయడం వల్ల.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవు. మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. మొత్తం వంద ఓట్లు ఉంటే.. యాభై ఒక్క ఓట్లు తెచ్చుకున్న వారికే గెలుపు రాదు. ఐదుగురు పోటీలో ఉండి.. ముగ్గురిరికి ఇరవై, ఒకరికి 19, మరొకరికి21 వస్తే .. 21 వచ్చిన వారిదే విజయం. మిగతా 79శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారు కదా అనే లాజిక్ మన ప్రజాస్వామ్యంలో పని చేయదు. . అందుకే పొత్తులు పెట్టుకుంటాయి. ఓట్లు చీలిపోవడం ద్వారా గెలుస్తామని సీఎం అనుకోవడం వల్లనే ఇలా సవాల్ చేస్తున్నారని సహజంగానే చర్చ ప్రారంభమయింది.

కలిసి పోటీ చేయవద్దని చెప్పడం బేలతనమే !

మొదటి సారి చంద్రబాబు, పవన్ విజయవాడలోని ఓ హోటల్‌లో కలిసినప్పుడు ఎంత మంది కలిసి వచ్చినా సరే వార్ వన్ సైడే అని.. వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రకటించారు. టీడీపీ, జనసేన అసలు విడిపోలేదని మొదటి నుంచి కలిసే ఉన్నాయన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వైసీపీ నేతలు కూడా ఓ క్లారిటీకి వచ్చారు. దీంతో రెండు పార్టీలను కలిపే విమర్శించడం ప్రారంభించారు. దీంతో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నదాన్ని వైఎస్ఆర్‌సీపీ పట్టించుకోవడం లేదని.. తమ ఓటు బ్యాంక్ తమకు ఉంటుందన్న ధైర్యంతో ఉందని అనుకుంటూ వచ్చారు.

పవన్ ను ఒంటరిగా పోటీ చేయించేందుకు ఎన్ని కుట్రలో !

అయితే అనూహ్యంగా ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలనే సవాల్ చేస్తూ వస్తున్నారు. టీడీపీతో కలిస్తే చంద్రబాబు సీఎం అవుతారని పవన్ సీఎం అవుతారా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ టీడీపీతో కలుస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే సీఎం ఎవరు అనే చర్చ కూడా పెట్టారు. . రెండు పార్టీలు ఇంకా అధికారికంగా ఎలాంటి పొత్తుల చర్చలు కూడా ప్రారంభించలేదు. జనసేన పార్టీ ఇప్పటికీ బీజేపీతో పొత్తులో ఉన్నామని చెబుతోంది. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం.. ఆ పార్టీ టీడీపీ వైపు మొగ్గు చూపుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. వైసీపీ నేతలూ నమ్ముతున్నారు. అందుకే ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు.

జగన్‌లో స్పష్టంగా కనిపిస్తున్న ఓటమి భయం !

అధికారంలోకి వచ్చి.. ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిన సీఎం జగన్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. అరాచక రాజ్యం స్థాపించారు. అభివృద్ధి అనే పదం లేకుండా చేశారు. ప్రజల జీవన ప్రమాణాల్ని దారుణంగా తగ్గించేశారు. ఇప్పుడు తాను పంచిన డబ్బులు తీసుకున్న వారు ఓట్లేస్తారన్న ఆశతో దింపుడు కళ్లెం సవాళ్లు చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీ కలిస్తే గెలుపు కష్టమని నివేదికలు రావడం ద్వారానే జగన్ ఇలా సవాళ్లు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇది నిజం కూడా !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఏపీ రాజధానేదో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి !

పాలకుడు సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునేవాడు అయి ఉండకూడదు. సొంత ప్రజల్ని నాశనం చేసి తాను ఒక్కడినే సింహాసనంపై కూర్చుని అందర్నీ పీల్చి పిప్పి చేయాలనే వ్యక్తిత్వం ఉండకూడదు. అలా ఉంటే...

ఎడిటర్స్ కామెంట్ : గుర్తుకొస్తున్నావయ్యా.. శేషన్ !

టీ.ఎన్.శేషన్. ఈ పేరు భారత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్మరించుకుంటూనే ఉన్నారు. గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆయనను మరిపించేలా మాత్రం ఎవరూ రావడం లేదు. ఎన్నికల సంఘం...

నిప్పుల కుంపటిలా తెలంగాణ..

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ...

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

HOT NEWS

css.php
[X] Close
[X] Close