ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌… లైవ్ పెర్‌ఫార్మ్సెన్స్ ఎందుకు ఇవ్వ‌లేదు?

నాటునాటు పాట‌కు ఆస్కార్ వ‌చ్చింది. ఈ పాట‌ని లైవ్ లో.. పాడి కాల‌భైర‌వ‌, రాహుల్ సిప్లిగంజ్ అరుదైన అవ‌కాశాన్ని అందిపుచ్చుకొన్నారు. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు కూడా వేదిక‌పై డాన్స్ చేస్తే చూడాల‌ని ఫ్యాన్స్ ఆశ ప‌డ్డారు. కానీ.. అది జ‌ర‌గ‌లేదు. దీనిపై భిన్న‌మైన స‌మాధానాలు వ‌చ్చాయి. `స్టేజీపై డాన్స్ చేసే అవ‌కాశం వ‌చ్చింది.కానీ.. ప్రాక్టీస్‌కి త‌గిన స‌మ‌యం దొర‌క‌లేదు. అందుకే డాన్స్ చేయ‌డం లేదు` అని ఎన్టీఆర్ ఓ సంద‌ర్భంలో చెప్పాడు. చ‌ర‌ణ్ మాత్రం త‌మ‌కు ఆహ్వానం అంద‌లేద‌న్నారు. దాంతో.. ఫ్యాన్స్ క‌న్‌ఫ్యూజ్ అయ్యారు. ఆస్కార్ క‌మిటీ… లైవ్ పెర్‌ఫార్మ్ చేసే అవ‌కాశం ఇచ్చానా.. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు ఒప్పుకోలేదా? అంటూ అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఇప్పుడు అదే నిజ‌మైంది. ఆస్కార్ వేదిక‌పై నాటు నాటు పాట‌కు లైవ్ పెర్‌ఫార్మ్ ఇవ్వ‌డానికి ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌ను ఆహ్వానించామ‌ని, అయితే… దానికి వారిద్ద‌రూ ఒప్పుకోలేద‌ని ఆస్కార్ క‌మిటీలోని కీల‌క స‌భ్యుడు వెల్ల‌డించారు.

ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో.. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌కు ఆస్కార్ క‌మిటీ నుంచి పిలుపు అందింద‌ని, పాట‌కు లైవ్‌లో డాన్స్ చేయ‌గ‌ల‌రో, లేదో వాక‌బు చేసింద‌ని తెలుస్తోంది. మామూలుగా అయితే ఓ పాట‌కు 15 రోజుల ప్రిప‌రేష‌న్ చాలు. కానీ.. నాటు నాటు మామూలు పాటు కాదు. ఆ పాటంతా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు ఓ సింక్‌లో డాన్స్ చేస్తారు. చాలా క్లిష్ట‌త‌ర‌మైన స్టెప్పులున్నాయి. సెట్లోనే.. ఒక్కో స్టెప్పుకీ టేకుల మీద టేకులు తీసుకొన్నారు. ఈ పాట తెర‌కెక్కించ‌డానికి దాదాపుగా 17 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. ఇలాంటి పాట‌ని లైవ్ లో చేయ‌డం చాలా క‌ష్టం. ఏమాత్రం సింక్ త‌ప్పినా… అభాసుపాల‌వుతారు. అందుకే ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు ఆ రిస్క్ తీసుకోలేదేమో అనిపిస్తోంది. ఓ పాట‌కు లైవ్‌లో డాన్స్ చేసిన అనుభ‌వం ఎన్టీఆర్‌. చ‌ర‌ణ్‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ లేదు. పైగా ఆస్కార్ అనేది మామూలు వేదిక కాదు. అకాడ‌మీ సైతం ఈ రిహార్స‌ల్స్ ని ప‌రీశీలిస్తుంది. వాటి ప్రోటో కాల్స్ వేరుగా ఉంటాయి. అందుకే హీరోలిద్ద‌రూ.. `నో` చెప్పి ఉంటారు. నిజంగా.. చేసి ఉంటే, ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌ల పేర్లు చ‌రిత్ర‌లో నిలిచిపోదును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close