మీడియా వాచ్: సాక్షి ఏపీ సర్క్యలేషన్ 2 లక్షలేనా ?

దినపత్రికల సర్క్యూలేషన్‌ను నిర్ణయించే అడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ కీలక విషయాలను వెల్లడించింది. ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నా సాక్షి పత్రిక ఈనాడు దరి దాపుల్లోకి కూడా రావడం లేదు. తాజాగా గత డిసెంబర్ నాటికి ఏ పేపర్‌కు ఎంత సర్క్యూలేషన్ ఉందో అడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ అంకెలు రిలీజ్ చేసంది. ఈనాడు పత్రికకు 13 లక్షల యాభై వేలకుపైగా కాపీల సర్క్యూలేషన్ ఉంటే.. సాక్షిది పది లక్షల దగ్గర ఉంది. అంటే.. మూడున్నర లక్షలకుపైగా కాపీలు ఈనాడువి ఎక్కువ. ఈ సర్క్యూలేషన్ ఏపీ, తెలంగాణ మొత్తం కలిపి.

అదే ఏపీ ఒక్క రాష్ట్రం తీసుకుంటే ఈనాడు సర్క్యూలేషన్ 7 లక్షల 55 వేలు కాగా .. సాక్షి పత్రిక సర్క్యూలేషన్ 5 లక్షల 85వేలు. నిజానికి ఈ ఐదు లక్షల సర్క్యూలేషన్లో ప్రజాధనంతోనే మూడు లక్షలకుపైగా కాపీలను కొంటున్నారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు రూ. రెండు వందలు ఇచ్చి మరీపేపర్ కొనిపిస్తున్నారు. అలాగే ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో రెండేసి పేపర్లు వేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించి పేపర్లు కొనిపిస్తున్నారు. యూనివర్శిటీలు సహా ఇతర చోట్ల.. బలవంతంగా పేపర్ అంట కడుతున్నారు. ఇంత చేస్తున్నా ఆ పత్రిక సర్క్యూలేషన్ … ఏపీలో ఆరు లక్షలు కూడా లేదంటే.. డబ్బులు పెట్టే కొనే నిఖార్సైన పాఠకులు సాక్షి పత్రికకు పూర్తిగా అడుగంటి పోయారని స్పష్టమవుతోంది.

ఖచ్చితంగా సాక్షికి రెండు లక్షలు మాత్రమే సర్క్యులేషన్ ఉంటుందని… దారుణంగా పడిపోయింది కాబట్టే.. ప్రజాధనంతో కొనిపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలా వాలంటీర్లతో పత్రికను కొనిపించడంపై ఈనాడు సుప్రీంకోర్టులో కేసు వేసింది. విచారణ జరగాల్సి ఉంది. మరో వైపు ఇంత చేసినాసాక్షి పేపర్ మెరుగుపడకపోవడంతో ప్రభుత్వం మారితే కప్పకూలిపోతుందన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. అసలు సర్క్యూలేషన్ లేకపోయినా వందల కోట్ల ప్రజాధనం .. ఆ పత్రికకు కట్టబెడుతున్నారు. మొత్తంగా ఈనాడు … కరోనా అనంతర పరిస్థితుల్ని తట్టుకుని నిలబడుతోంది కానీ.. సాక్షి పునాదులు కదిలిపోయాయని… అప్పనంగా దొరకిన అధికారంతో ప్రజాసొమ్ముతో నిలబెడుతున్నారని అంచనాకు వస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close