బండి సంజయ్‌పై పోలీసుల కంటే ముందే బీఆర్ఎస్, మీడియా విచారణలు !

తెలంగాణ రాజకీయం ప్రచారాల మీదనే నడుస్తోంది. ఇంత కాలం ఏపీలో అలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అది తెలంగాణకు విస్తరించింది. అసలు లీక్ కాని టెన్త్ పేపర్ లీకేజీ అనే మాల్ ప్రాక్టిస్ కేసులో బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్లో ఆయనపై నమోదు చేసిన కేసు చూస్తే ఆయనను ప్రివెన్షన్ అరెస్ట్.. అంతే ముందుజాగ్రత్త అరెస్ట్ చేసినట్లుగా స్పష్టమవుతుంది. ఆయన పేపర్ లీకేజీలను కారణం చూపి రెచ్చగొట్ట ప్రయత్నం చేస్తున్నారని.. లా అండ్ ఆర్డర్ సమస్యలకు కారణం అవుతారని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కమలాపూర్‌లో నమోదైన కేసు ఎఫ్ఐఆర్ కూడా వెలుగులోకి వచ్చింది. అయితే అందులోనూ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. గుర్తు తెలియని వ్యక్తులు అని ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌ను ప్రివెన్షన్ అరెస్ట్ చేసిన పోలీసులు మొదట హైదరాబాద్ తరలించారు.. తర్వాత వరంగల్ వైపు తరలించారు. దీంతో కమలాపూర్ లో హిందీ ప్రశ్నాపత్రం లీకైన కేసులో – . బండి సంజయ్‌పై కేసు నమోదు చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే బండి సంజయ్ ఎలాంటి నేరానికి పాల్పడ్డారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

పేపర్ ఇలా బయటకు రావడం వెనుక బండి సంజయ్ కుట్ర ఉందని బయట బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పేపర్ బయటకు పంపిన నిందితుడికి బండి సంజయ్ చాలా సార్లు కాల్ చేశారని… ఆయనకు ప్రశ్నాపత్రం వాట్సాప్ లో అందిందని ప్రచారం చేస్తున్నారు. అయితే పరీక్షఅయిపోయిన రెండు గంటల తర్వాత బండి సంజయ్ ఫోన్‌కు పేపర్ వస్తే కుట్ర ఎలా అవుతుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వవ్యహారం రాజకీయ దుమారం రేగుతోంది. బండి సంజయ్ పై ఎన్ని కేసులు నమోదయ్యాయన్నది కూడా స్పష్టత రావాల్సి ఉంది.

అయితే ముందుగానే విచారణ జరిపేసి.. బండి సంజయ్ నేరం చేసేశారని.. బీఆర్ఎస్‌తో పాటు టీవీ9 లాంటి మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close