ఆస్కార్‌ టీమ్‌కు అమిత్ షా సన్మానం – రాజకీయం ఉండదా ?

నాటు నాటు పాటకు ఆస్కార్ గెలుచుకున్న ట్రిపుల్ ఆర్ సినిమా టీంకు అమిత్ షా విందు ఇవ్వనున్నారు. ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిచి స్పెషల్ గా అదే ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే.. రాజకీయ ఉద్దేశాలు లేవు అనుకోవచ్చు. కానీ రాజకీయ పర్యటన కోసం తెలంగాణకు వస్తున్న ఆయన ఓ అరగంట విందు కోసం కేటాయించారు. ఈ మేరకు ట్రిపుల్ ఆర్ టీంకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఈ విందు భేటీ జరగనుంది.

నిజానికి ఆర్ ఆర్ ఆర్ టీం ఆస్కార్ అవార్డుల తర్వాత విడివిడిగా ఇండియాకు చేరుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ఇండియాకు వచ్చిన తర్వాత అమిత్ షాను కలిశారు. అప్పుడు చిరంజీవి, రామ్ చరణ్‌లను అమిత్ షా సత్కరించారు. అలాగే సినిమా ఇంకా ఆస్కార్ విజయం సాధించకముందు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ ను హోటల్‌కు పిలిపించుకుని అభినందించారు. అయితే ఇప్పుడు అధికారికంగా టీం మొత్తానికి సన్మానం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

రాజకీయంగా ఉపయోగపడే ఏ చిన్న చాన్స్ వచ్చినా అమిత్ షా లాంటి వాళ్లు వదిలి పెట్టరన్న అభిప్రాయం ఉంది . ఆర్ ఆర్ ఆర్ టీం ద్వారా వీలైనంతగా పొలిటికల్ గెయిన్ పొందాలన్న వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ విషయం నిజమే అయినా ట్రిపుల్ ఆర్ టీం ఈ విందును ఎవాయిడ్ చేయలేదు.. ఎందుకంటే.. పిలిచిన వ్యక్తి ఆషామాషీ కాదు మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close