సుకుమార్ స్క్రీన్ ప్లేకి రూ.6 కోట్లు

సుకుమార్ రైటింగ్స్ నుంచి వ‌చ్చిన మ‌రో సినిమా విరూపాక్ష‌. ఈ క‌థ‌కి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించ‌డ‌మే కాకుండా… ప్రాజెక్ట్ సెట్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ క‌థ‌ని సాయిధ‌ర‌మ్‌కి వినిపించి, నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌ని లింక్ చేశాడు సుకుమార్‌. క‌థ‌లో సుక్కు మార్క్ క‌నిపించ‌క‌పోయినా, కీల‌క‌మైన మ‌లుపుల విష‌యంలో సుకుమార్ స‌లహాలు బాగా ప‌నిచేశాయి. విడుద‌ల‌కు ముందే మంచి బిజినెస్ జ‌రుపుకొంది. దాంతో… సుకుమార్ వాటాగా రూ.6 కోట్లు ద‌క్కించుకొన్నాడు. ఈ సినిమా కోసం సుకుమార్ పెట్టిన పెట్టుబ‌డి… త‌న తెలివితేట‌లే. ఇప్పుడు సినిమా హిట్ట‌య్యింది. సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్ లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కూడా అంతే. భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని సెట్ చేసి, సంభాష‌ణ‌లు అందించాడు. ఈ సినిమాకి గానూ త్రివిక్ర‌మ్ కి రూ.10 కోట్లు ద‌క్కాయి. ఇప్పుడు సుకుమార్ వంతు వ‌చ్చిందంతే! ఈ యేడాది సుకుమార్ నుంచి మ‌రో ఇద్ద‌రు శిష్యులు మెగా ఫోన్ ప‌ట్ట‌బోతున్నార‌ని టాక్‌. అందులో ఓ లేడీ డైరెక్ట‌ర్ ఉంద‌ట‌. ఇక నుంచి ప్ర‌తీ యేడాది సుకుమార్ రైటింగ్స్ నుంచి రెండు సినిమాలు చేయాల‌ని, ఇద్ద‌రు శిష్యుల‌ను ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం చేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ట సుక్కు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close